News February 3, 2025
కోహ్లీని ఎలా ఔట్ చేయాలో బస్ డ్రైవర్ చెప్పాడు: సాంగ్వాన్

ఇటీవల రంజీ మ్యాచ్లో కోహ్లీని ఔట్ చేసిన H.సాంగ్వాన్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘ఢిల్లీ తరఫున పంత్, కోహ్లీ ఆడతారనుకున్నాం. ఆ తర్వాత కోహ్లీ మాత్రమే బరిలోకి దిగుతున్నారని, మ్యాచ్ టెలికాస్ట్ అవుతున్నట్లు తెలిసింది. ఆ సమయంలో మా బస్సు డ్రైవర్ విరాట్కు ఫోర్త్ లేదా ఫిఫ్త్ స్టంప్ బాల్ వేస్తే ఔట్ అవుతారన్నారు. కానీ నేను నా ప్లాన్ ప్రకారం బౌల్ చేశా’ అని చెప్పారు. ఈ మ్యాచ్లో విరాట్ 6పరుగులే చేశారు.
Similar News
News April 7, 2026
జైలర్-2 కోసం షారుఖ్ 5 రోజుల షూటింగ్?

నెల్సన్ డైరెక్షన్లో రజినీకాంత్ నటిస్తున్న జైలర్-2 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా హైదరాబాద్లో జరిగిన చిత్రీకరణలో మోహన్ లాల్ తన పార్ట్ను కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్గా క్యామియో రోల్ చేయనున్నారు. ఇందుకు 5 రోజులు డేట్స్ ఇచ్చారని, త్వరలోనే షూటింగ్ జరగనుందని సమాచారం. ఇది HYDలోనా, మరో సిటీలోనా అనేది త్వరలో క్లారిటీ రానుంది.
News April 7, 2026
పంజాబీ నటితో అర్ష్దీప్ డేటింగ్? ఫొటో వైరల్!

స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ తాజాగా షేర్ చేసిన ఒక స్నాప్చాట్ ఫొటో హాట్ టాపిక్గా మారింది. దాంట్లో అర్ష్దీప్ ఒకమ్మాయి చేయి పట్టుకొని ఉండగా నెటిజన్లు ఆమె పంజాబీ నటి సమ్రీన్ కౌర్ అని అంటున్నారు. ఆమె చేతిపై ఉన్న టాటూ ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చారు. IPL 2026 మ్యాచుల్లో సమ్రీన్ పంజాబ్ జెర్సీలో కనిపించడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. వీరిద్దరూ తమ రిలేషన్పై ఇప్పటివరకు స్పందించలేదు.
News April 7, 2026
అపస్మారక స్థితిలో ఇరాన్ సుప్రీం లీడర్!

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆచూకీపై తొలిసారి కీలక సమాచారం బయటకు వచ్చింది. ఆయన ఇరాన్లోని ఖోమ్ నగరంలో అపస్మారక స్థితిలో చికిత్స తీసుకుంటున్నారని అమెరికా, ఇజ్రాయెల్ గూఢచారులు గల్ఫ్ దేశాలకు చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. తన పనులు తాను చేసుకోలేని స్థితిలో ఉన్నారట. కాగా FEB 28 దాడుల్లో అలీ ఖమేనీ చనిపోగా, మొజ్తబా గాయపడ్డారు. షియా ముస్లింలకు పవిత్రంగా భావించే ఖోమ్లో అలీ అంత్యక్రియలు జరిగాయి.


