News February 3, 2025
కోహ్లీని ఎలా ఔట్ చేయాలో బస్ డ్రైవర్ చెప్పాడు: సాంగ్వాన్

ఇటీవల రంజీ మ్యాచ్లో కోహ్లీని ఔట్ చేసిన H.సాంగ్వాన్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘ఢిల్లీ తరఫున పంత్, కోహ్లీ ఆడతారనుకున్నాం. ఆ తర్వాత కోహ్లీ మాత్రమే బరిలోకి దిగుతున్నారని, మ్యాచ్ టెలికాస్ట్ అవుతున్నట్లు తెలిసింది. ఆ సమయంలో మా బస్సు డ్రైవర్ విరాట్కు ఫోర్త్ లేదా ఫిఫ్త్ స్టంప్ బాల్ వేస్తే ఔట్ అవుతారన్నారు. కానీ నేను నా ప్లాన్ ప్రకారం బౌల్ చేశా’ అని చెప్పారు. ఈ మ్యాచ్లో విరాట్ 6పరుగులే చేశారు.
Similar News
News November 3, 2025
ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం

AP: తిరుపతిలోని SV యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. సైకాలజీ డిపార్ట్మెంట్లో జూనియర్ విద్యార్థులను సీనియర్స్ ర్యాగింగ్ చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిపై సైకాలజీ డిపార్ట్మెంట్ HOD విశ్వనాథ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ‘ర్యాగింగ్ చేస్తారు, ఏమైనా చేస్తారు’ అని అన్నారని, విశ్వనాథ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
News November 3, 2025
OTTలోకి కొత్త సినిమాలు.. స్ట్రీమింగ్ అప్పుడేనా?

దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదలైన సిద్ధూ జొన్నలగడ్డ ‘తెలుసు కదా’, ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ సినిమాలు త్వరలో నెట్ఫ్లిక్స్లోకి రానున్నాయి. ఈ నెల 7 నుంచి ‘తెలుసు కదా’, 14 నుంచి ‘డ్యూడ్’ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఇటీవల విడుదలైన రవితేజ ‘మాస్ జాతర’ సినిమా OTT హక్కులను కూడా నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. నెల రోజుల తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశముంది.
News November 3, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

➢ CM రేవంత్తో అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధుల భేటీ.. ఈ నెల 14న కొడంగల్లోని ఎన్కేపల్లి వద్ద నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ కిచెన్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం.. ఈ కిచెన్ నుంచి ప్రభుత్వ స్కూళ్లకు మధ్యాహ్న భోజనం సరఫరా
➢ ఆదిలాబాద్ ఎయిర్పోర్టు కోసం 700 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు
➢ ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలన్న CCI నిబంధన ఎత్తివేయాలి.. కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ


