News May 10, 2024
ఓటర్లను భయపెడుతున్న బస్సు ఛార్జీలు

ఈ నెల 13న ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లే వారికి బస్సు ఛార్జీలు చుక్కలు చూపిస్తున్నాయి. HYD నుంచి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు RTC ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల్లో సీట్లు ఫుల్ అయిపోయాయి. ఈ క్రమంలో ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు సాధారణ ఛార్జీల మీద రూ.1000- రూ.1500 వరకు అధికంగా వసూలు చేస్తున్నాయి. HYD నుంచి VJA, విశాఖ, రాజమండ్రికి టికెట్ గరిష్ఠంగా రూ.3000 ఉంది. దీంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు.
Similar News
News February 11, 2026
యూజర్లు మోసపోకుండా ఎయిర్టెల్ స్పెషల్ ఫీచర్!

బ్యాంకింగ్ మోసాల నుంచి వినియోగదారులను రక్షించేందుకు ఎయిర్టెల్ సరికొత్త AI ఫ్రాడ్ అలర్ట్ ఫీచర్ను తీసుకొచ్చింది. మోసగాళ్లు ఫోన్ చేసినప్పుడు ఈ సాంకేతికత వారిని వెంటనే గుర్తించి వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది. ముఖ్యంగా OTP చెప్పవద్దని ముందే హెచ్చరిస్తుంది. దీనివల్ల సామాన్యుల డబ్బు సురక్షితంగా ఉంటుంది. నెట్వర్క్ స్థాయిలో పనిచేసే ఈ సాంకేతికత బ్యాంకింగ్ మోసాలను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించనుంది.
News February 11, 2026
నువ్వుల చేనులో మనుషులతో కలుపుతీత – లాభాలు

నువ్వుల పంటలో కలుపు ప్రధాన సమస్యగా ఉంటుంది. పంట విత్తిన 15-20 రోజుల లోపు చేనులో అదనపు మొక్కలను తొలగించాలి. విత్తిన 25-30 రోజుల తర్వాత మందులతో కలుపును నివారించకుండా మనుషులతో కలుపు తీయించాలి. దీని వల్ల కలుపు మొక్కలు నశించడమేకాకుండా భూమి గుల్లబారి ఎక్కువ తేమ భూమిలో నిల్వ ఉంటుంది. ఫలితంగా పంట త్వరగా నీటి ఎద్దడికి గురికాదు. విత్తనాలను వరుసల్లో విత్తితే చేనులో కలుపు తీయడానికి అనుకూలంగా ఉంటుంది.
News February 11, 2026
ఎగ్జిమ్ బ్యాంక్లో 40 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

ఎక్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 40 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా 4రోజులే(FEB 15) సమయం ఉంది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ(MBA/PGDBA/PGDBM/MMS), ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్, సీఏలో స్పెషలైజేషన్ అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. https://www.eximbankindia.in/


