News May 10, 2024
ఓటర్లను భయపెడుతున్న బస్సు ఛార్జీలు

ఈ నెల 13న ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లే వారికి బస్సు ఛార్జీలు చుక్కలు చూపిస్తున్నాయి. HYD నుంచి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు RTC ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల్లో సీట్లు ఫుల్ అయిపోయాయి. ఈ క్రమంలో ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు సాధారణ ఛార్జీల మీద రూ.1000- రూ.1500 వరకు అధికంగా వసూలు చేస్తున్నాయి. HYD నుంచి VJA, విశాఖ, రాజమండ్రికి టికెట్ గరిష్ఠంగా రూ.3000 ఉంది. దీంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు.
Similar News
News September 13, 2025
షూటింగ్లు చేసేందుకు కాదు మీకు ఓటేసింది: పవన్పై రోజా ఫైర్

AP: రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను Dy.CM పవన్ కళ్యాణ్ పట్టించుకోకుండా ప్యాకేజీలు తీసుకుంటూ కాలం గడిపేస్తున్నారని YCP నేత రోజా విమర్శించారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు పవన్ మద్దతివ్వడం దారుణమన్నారు. ‘ఆయనకు ఓట్లు వేసినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారు. Dy.CM స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతూ ప్రభుత్వ ధనం వృథా చేస్తున్నారు. షూటింగ్లు చేసుకునేందుకు కాదు ప్రజలు ఆయనకు ఓట్లేసింది’ అంటూ ఆమె ఫైర్ అయ్యారు.
News September 13, 2025
ఒత్తయిన కనుబొమ్మలకి ఈ చిట్కాలు

అందమైన, ఒత్తయిన కనుబొమ్మల కోసం అమ్మాయిలు ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. వారంలో రెండుసార్లు పెట్రోలియం జెల్లీని ఐబ్రోస్కి అప్లై చేసి, మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ జరిగి కనుబొమ్మలు అందంగా పెరుగుతాయి. మెంతిపిండిలో కొబ్బరినూనె కలిపి కనుబొమ్మలకు రాత్రి అప్లై చేసి, ఉదయం శుభ్రం చేసుకోవాలి. మెంతిలో ఉండే నికోటినిక్ ఆమ్లం, లెసిథిన్లు కనుబొమ్మలు ఒత్తుగా పెరగటానికి సహాయపడతాయి.
News September 13, 2025
213 ఉద్యోగాలకు నోటిఫికేషన్

యూపీఎస్సీలో 213 లెక్చరర్, మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. LLB, MBBS చేసిన అభ్యర్థులు ఇవాళ్టి నుంచి OCT 2వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. వయసు 50ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్ను బట్టి సడలింపు ఉంటుంది. పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం <
#ShareIt