News May 10, 2024
ఓటర్లను భయపెడుతున్న బస్సు ఛార్జీలు

ఈ నెల 13న ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లే వారికి బస్సు ఛార్జీలు చుక్కలు చూపిస్తున్నాయి. HYD నుంచి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు RTC ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల్లో సీట్లు ఫుల్ అయిపోయాయి. ఈ క్రమంలో ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు సాధారణ ఛార్జీల మీద రూ.1000- రూ.1500 వరకు అధికంగా వసూలు చేస్తున్నాయి. HYD నుంచి VJA, విశాఖ, రాజమండ్రికి టికెట్ గరిష్ఠంగా రూ.3000 ఉంది. దీంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు.
Similar News
News October 13, 2025
రేపు చరిత్ర సృష్టించబోతున్నాం: మంత్రి లోకేశ్

AP: రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ సంస్థ రేపు MOU చేసుకోబోతోందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ‘2024 OCTలో USలోని Google ఆఫీసును సందర్శించా. ఏడాదిపాటు చర్చలు, కృషి తర్వాత రేపు చరిత్ర సృష్టించబోతున్నాం. టెక్ దిగ్గజాల్లో ఒక్కటైన గూగుల్ మన ఏపీకి వస్తోంది. ఈ 1GW ప్రాజెక్టు విలువ 10 బిలియన్ డాలర్లు. ఇది గేమ్ ఛేంజింగ్ ఇన్వెస్ట్మెంట్. రాష్ట్ర డిజిటల్ భవిష్యత్తు, ఇన్నోవేషన్కు ముందడుగు’ అని పేర్కొన్నారు.
News October 13, 2025
విష్ణువు నరసింహ అవతారం ఎందుకు ఎత్తాడు?

హిరణ్యకశిపుడు బ్రహ్మ దేవుడి నుంచి ‘పగలు, రాత్రి; ఇంట్లో, బయట; ఆకాశంలో, భూమిపైన; ఆయుధంతో, నిరాయుధుడిగా; మనిషి చేత, జంతువు చేత’ మరణం ఉండదని వరం పొందాడు. తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడానికి, ఈ వరాలను తప్పు పట్టకుండా, విష్ణువు సంధ్యా వేళలో(పగలు-రాత్రి కాని వేళ), ఇంటి గడపపై (ఇంట్లో-బయట కాని చోట), తన ఒడిలో ఉంచుకొని (ఆకాశం-భూమి కాని ప్రదేశం), గోళ్లతో(ఆయుధం-నిరాయుధం కానిది), నరసింహ రూపంలో సంహరించాడు.
News October 13, 2025
సాయంకాలం ఇంటి తలుపులు మూసేస్తున్నారా?

పురాణాల ప్రకారం.. సాయంత్రం వేళ జ్యేష్ఠాదేవి వెనుక ద్వారం నుంచి, మహాలక్ష్మి సింహద్వారం నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తారు. అందుకే సంధ్యా సమయానికి ముందే ఇల్లు శుభ్రం చేసి, లక్ష్మీదేవి ఆగమనాన్ని ఆహ్వానించాలి. జ్యేష్ఠాదేవి రాకుండా, వెనుక వైపు తలుపులను మూసి, ప్రధాన ద్వారాన్ని తెరిచి ఉంచాలి. ఫలితంగా అమ్మవారి కటాక్షం లభిస్తుంది.
☛ మరిన్ని ధర్మ సందేహాల నివృత్తి కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.