News January 10, 2025
బస్సు టికెట్ రూ.6వేలు, ఫ్లైట్ టికెట్ రూ.15వేలు

సంక్రాంతి పండక్కి వెళ్లే వారిని ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు దోచుకుంటున్నారు. ఇదే అదనుగా బస్సు టికెట్ ధరలను భారీగా పెంచేశారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రూ.4వేలు, విశాఖకు రూ.6వేలు వసూలు చేస్తున్నారు. అటు HYD నుంచి విశాఖ ఫ్లైట్ టికెట్ ధర రూ.15వేలుగా ఉంది. డబుల్, ట్రిపుల్ రేట్లను వసూలు చేస్తుండటంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. ఆర్టీసీ బస్సుల సంఖ్యను మరింత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News October 20, 2025
ఇదేం ఆట.. టీమ్ ఇండియాపై ఫ్యాన్స్ ఫైర్

వరల్డ్ కప్-2025: ఇంగ్లండ్పై భారత మహిళల టీమ్ చేజేతులా మ్యాచ్ ఓడిపోయిందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 30 బంతుల్లో 36 రన్స్ చేయాల్సి ఉండగా 6 వికెట్లు చేతిలో ఉన్నాయని, అయినా గెలవలేకపోయిందని మండిపడుతున్నారు. ఇలాంటి ఆటతీరుతో భారత్ WC నెగ్గడం కష్టమేనని విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా గత 3 మ్యాచుల్లో భారత్ పరాజయం పాలైంది. దీంతో సెమీస్ అవకాశాలు సన్నగిల్లాయి. అటు AUS, దక్షిణాఫ్రికా, ENG సెమీస్ చేరాయి.
News October 20, 2025
చంద్రబాబూ.. మీది ఏ రాక్షస జాతి: YCP

AP: 2019-24 మధ్య రాష్ట్రాన్ని ఒక రాక్షసుడు పట్టిపీడించాడని CM చంద్రబాబు చేసిన <<18052970>>వ్యాఖ్యలపై<<>> YCP మండిపడింది. ‘చంద్రబాబు గారూ.. మీరు ఏ రకం రాక్షస జాతికి చెందిన వారు. ఎందుకంటే వరుసగా రెండుసార్లు 2004, 2009లో ప్రజలు మిమ్మల్ని చిత్తుచిత్తుగా ఓడించారు. 2019లోనూ మట్టికరిపించారు. అసలు మీరు CM పీఠంలోకి వచ్చిందే.. NTR గారిని వెనక నుంచి పొడిచి. ఇది ఏ రాక్షసజాతి లక్షణం అంటారు’ అని ట్వీట్ చేసింది.
News October 19, 2025
WWC: ఉత్కంఠ పోరులో భారత జట్టు ఓటమి

ఉమెన్స్ వరల్డ్ కప్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచులో భారత్ 4 పరుగుల తేడాతో ఓడింది. 289 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 284/6 రన్స్కు పరిమితమైంది. స్మృతి మంధాన 88, హర్మన్ ప్రీత్ 70, దీప్తి శర్మ 50 రన్స్తో రాణించారు. సులభంగా గెలిచే అవకాశాలున్నా చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయి, బౌండరీలు బాదకపోవడంతో ఓటమి తప్పలేదు. ఈ పరాజయంతో టీమ్ ఇండియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.