News July 12, 2024
నదిలో పడిన బస్సులు.. 63 మంది గల్లంతు!

నేపాల్లోని మదన్-ఆశ్రిత్ హైవేలో ఇవాళ తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడడంతో రెండు బస్సులు త్రిశూలి నదిలో పడిపోయాయి. దీంతో డ్రైవర్లతో సహా 63 మంది గల్లంతయ్యారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎడతెరిపి లేని వర్షం వల్ల గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఆ దేశ పీఎం ప్రచండ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికులను వెంటనే రక్షించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News October 18, 2025
సహజంగా పరిమళాలు అద్దేద్దాం..

ఎక్కడికైనా వెళ్లడానికి రెడీ అవ్వడం అంటే మేకప్, మంచి డ్రెస్ చివరిగా ఫెర్ఫ్యూమ్ వేసుకుంటాం. కానీ వీటిలో ఉండే రసాయనాల వల్ల దుస్తులపై మరకలు పడటంతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇలా కాకుండా కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ వాడితే రసాయనాలు లేకుండా సహజసిద్ధ పరిమళాలను ఆస్వాదించొచ్చంటున్నారు నిపుణులు. వాటిల్లో లావెండర్, మింట్, గంధం నూనె, రోజ్ ఆయిల్ వంటివి మంచి స్మెల్ని ఇస్తూనే ఆరోగ్యాన్నీ కాపాడతాయి.
News October 18, 2025
వైకల్య ధ్రువీకరణకు కేంద్రం కొత్త రూల్స్

వైకల్య ధ్రువీకరణకు సవరించిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ను కేంద్రం జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు అభ్యర్థులు సమర్పించే సర్టిఫికేట్స్ పరిశీలనలో ఈ రూల్స్ పాటించాలని స్పష్టం చేసింది. ప్రతి సర్టిఫికేట్ను, యునిక్ డిజబిలిటీ ఐడీ కార్డును జాతీయ పోర్టల్లో చెక్ చేయాలని ఆదేశించింది. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్తో ఆయా సంస్థలు అనుసంధానం చేసుకోవాలని సూచించింది.
News October 18, 2025
DRDOలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్లు

DRDO అనుబంధ సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (DRDE) 5 జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ల కోసం దరఖాస్తులు కోరుతోంది. BE, B.Tech, B.TEXT, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు NET, CSIR-UGC NET, గేట్ స్కోరు సాధించి ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. గ్వాలియర్లో DRDEలో నవంబర్ 6న ఉదయం 9.30గంటలకు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్: https://www.drdo.gov.in