News January 28, 2025
బంగారం కొనుగోళ్లకు EMI ఉండాలి.. కేంద్రాన్ని కోరిన వ్యాపార వర్గాలు

బంగారం ధరలు భారీగా పెరుగుతుండడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు కొనుగోళ్లకు వెనకడుగు వేస్తున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని EMI పద్ధతి ద్వారా బంగారు ఆభరణాల కొనుగోలుకు అనుమతించాలని వ్యాపార వర్గాలు కోరుతున్నాయి. ఈ కొత్త విధానాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టాలని, అలాగే దేశీయంగా గోల్డ్ మార్కెట్ నియంత్రణకు ఒక్కటే రెగ్యులేటరీ బాడీ ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.
Similar News
News November 27, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (<
News November 27, 2025
చలికాలంలో పాదాలు పగులుతున్నాయా?

చలికాలంలో కనిపించే ప్రధాన సమస్యల్లో మడమల పగుళ్లు ఒకటి. చలి కాలంలో పొడి గాలుల కారణంగా మడమల చర్మంలో తేమ తగ్గుతుంది. ఈ కారణంగా చర్మం పొడిగా మారి పాదాలలో పగుళ్లు ఏర్పడుతాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ అప్లై చేసి సాక్సులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. డీ హైడ్రేషన్ వల్ల కూడా పాదాలు పగులుతాయి కాబట్టి తగినంత నీరు తాగాలని చెబుతున్నారు.
News November 27, 2025
పారిపోయిన వారిని తీసుకొచ్చే హక్కు కేంద్రానికి ఉంది: సుప్రీంకోర్టు

నేరాలు చేసి విదేశాలకు పారిపోయిన వారిని తీసుకొచ్చే హక్కు కేంద్రానికి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. గుజరాత్కు చెందిన విజయ్ మురళీధర్ ఉద్వానీ కేసు విచారణలో జడ్జీలు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 2022 జులైలో దుబాయ్ పారిపోయిన ఉద్వానీపై గుజరాత్ హైకోర్టు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. దానిని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది.


