News January 28, 2025
బంగారం కొనుగోళ్లకు EMI ఉండాలి.. కేంద్రాన్ని కోరిన వ్యాపార వర్గాలు

బంగారం ధరలు భారీగా పెరుగుతుండడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు కొనుగోళ్లకు వెనకడుగు వేస్తున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని EMI పద్ధతి ద్వారా బంగారు ఆభరణాల కొనుగోలుకు అనుమతించాలని వ్యాపార వర్గాలు కోరుతున్నాయి. ఈ కొత్త విధానాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టాలని, అలాగే దేశీయంగా గోల్డ్ మార్కెట్ నియంత్రణకు ఒక్కటే రెగ్యులేటరీ బాడీ ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


