News December 11, 2024
పసిఫిక్ ప్రాంతంలో చైనాను ఓడించగలం కానీ.: అమెరికా

చైనాను ఓడించడం తమకు సాధ్యమేనని అమెరికా ఇండో-పసిఫిక్ కమాండర్ అడ్మిరల్ శామ్యూల్ స్పష్టం చేశారు. కానీ సాంకేతికంగా డ్రాగన్పై తమకున్న పైచేయి క్రమంగా తగ్గుతూ వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘క్షిపణి టెక్నాలజీ, సమాచార వ్యవస్థలపై US ప్రధానంగా దృష్టి సారించాలి. సైబర్ దాడుల్ని తట్టుకునేలా ఆ సమాచార వ్యవస్థ ఉండాలి. క్షిపణులకు చాలా ఖర్చవుతోంది. పోరాటాల్లో వాటి బదులు డ్రోన్లను వాడాలి’ అని పేర్కొన్నారు.
Similar News
News November 18, 2025
జనవరిలో కొత్త ITR ఫారాలు: CBDT

కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం వచ్చే ఏడాది APR 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ చట్టంలో ఉన్న రూల్స్తో ITR ఫారాలను జనవరినాటికి అందుబాటులోకి తేనున్నట్లు CBDT వెల్లడించింది. పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యమని పేర్కొంది. కొత్త చట్టానికి అనుగుణంగా అకౌంటింగ్ సాఫ్ట్వేర్లలో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ఇక సరైన రిఫండ్ క్లెయిమ్లను DECలోగా పరిష్కరిస్తామని వివరించింది.
News November 18, 2025
జనవరిలో కొత్త ITR ఫారాలు: CBDT

కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం వచ్చే ఏడాది APR 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ చట్టంలో ఉన్న రూల్స్తో ITR ఫారాలను జనవరినాటికి అందుబాటులోకి తేనున్నట్లు CBDT వెల్లడించింది. పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యమని పేర్కొంది. కొత్త చట్టానికి అనుగుణంగా అకౌంటింగ్ సాఫ్ట్వేర్లలో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ఇక సరైన రిఫండ్ క్లెయిమ్లను DECలోగా పరిష్కరిస్తామని వివరించింది.
News November 18, 2025
రేపే అకౌంట్లలోకి రూ.7వేలు.. మీ పేరు ఉందా?

PM కిసాన్ 21వ విడత నిధులను కేంద్రం రేపు విడుదల చేయనుంది. అర్హులైన రైతుల ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.2 వేల చొప్పున ప్రధాని మోదీ జమచేస్తారు. అదే రోజున AP ప్రభుత్వం 2వ విడత అన్నదాత సుఖీభవ కింద అర్హులైన రైతులకు రూ.5వేల చొప్పున అందించనుంది. దీంతో ఈ 2 పథకాలకు అర్హులైన రైతుల అకౌంట్లలో రేపు రూ.7వేలు జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ అర్హతను ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.


