News August 1, 2024

బంగారం కొంటారా: US ఫెడ్ పంపిన సిగ్నల్స్ ఇవే

image

గోల్డ్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్! సెప్టెంబర్లో వడ్డీరేట్ల తగ్గింపుపై US ఫెడ్ సిగ్నల్స్ ఇచ్చింది. అప్పుడు ధర ఇంకా పెరగొచ్చు. ఎందుకంటే బంగారం, డాలర్ మధ్య విలోమ సంబంధం ఉంటుంది. ఒకటి పెరిగితే మరోటి తగ్గుతుంది. వడ్డీరేట్ల కోతతో పుత్తడి మంచి పెట్టుబడి సాధనం అవుతుంది. యుద్ధాలు, జియో పాలిటిక్స్‌ వల్ల భారత్, చైనా టన్నుల కొద్దీ గోల్డ్ కొంటున్నాయి. కస్టమ్స్ సుంకం తగ్గడంతో యెల్లో మెటల్ డిమాండ్ పెరగడం ఖాయం.

Similar News

News February 2, 2025

తెలుగోళ్లు.. టాలెంట్ చూపిస్తున్నారు

image

భారత జట్టు అనగానే అప్పట్లో ఒకరిద్దరి తెలుగు ప్లేయర్ల పేర్లే వినిపించేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. తెలుగు రాష్ట్రాల నుంచి సిరాజ్, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, గొంగడి త్రిష సత్తా చాటుతున్నారు. అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ పరంపర ఇలాగే కొనసాగుతూ మరింత మంది ప్లేయర్లు జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

News February 2, 2025

సంధ్య థియేటర్ తొక్కిసలాట.. విదేశాలకు శ్రీతేజ్?

image

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను నిర్మాత బన్నీ వాసు పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకువెళ్లాల్సి వస్తే ఖర్చు తానే భరిస్తానని వైద్యులతో చెప్పినట్లు తెలుస్తోంది. కాగా డిసెంబర్ 4న గాయపడ్డ శ్రీతేజ్ రెండు నెలలు కావొస్తున్నా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ట్యూబ్ ద్వారానే లిక్విడ్ ఫుడ్ అందిస్తున్నారు.

News February 2, 2025

కులగణన సర్వే వివరాలు

image

TG: * సర్వేలో పాల్గొన్న జనాభా: 3.54 కోట్లు(96.9 శాతం)
* ఎస్సీల జనాభా: 17.43 శాతం
* ఎస్టీల జనాభా: 10.45 శాతం
* బీసీల జనాభా: 46.25 శాతం
* ముస్లిం మైనారిటీ బీసీలు: 10.08 శాతం
* ముస్లింల మైనారిటీ బీసీలతో కలిపి మొత్తం బీసీలు: 56.33 శాతం
* ముస్లిం మైనారిటీ ఓసీలు: 2.48 శాతం
* ముస్లిం మైనారిటీలు: 12.56 శాతం
* ఓసీల జనాభా: 15.79 శాతం
* సర్వేలో పాల్గొనని జనాభా- 3.1 శాతం