News August 13, 2024
2036 నాటికి దేశ జనాభా 152 కోట్లు

2011 లెక్కల ప్రకారం 121 కోట్లుగా ఉన్న దేశ జనాభా 2036 నాటికి 152 కోట్లకు చేరనుంది. గణాంకాల శాఖ నివేదిక ప్రకారం పనిచేసే(15-59ఏళ్లు) వారి సంఖ్య 64.9 శాతానికి(గతంలో 60.7%) చేరనుంది. 2011లో లింగ నిష్పత్తి 1000:943 ఉండగా, 2036కు 1000:952కు పెరగనుంది. పట్టణ జనాభా 37.7కోట్ల నుంచి 59.4కోట్లకు, గ్రామీణ జనాభా 83కోట్ల నుంచి 92కోట్లకు చేరనుంది. 15ఏళ్ల లోపు వారి సంఖ్య తగ్గి 60ఏళ్లు పైబడే వారి సంఖ్య పెరగనుంది.
Similar News
News October 24, 2025
APEDAలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

APEDA 11 బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, అసోసియేట్ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. పోస్టును బట్టి బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ (అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, ప్లాంటేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫారెన్ ట్రేడ్, పబ్లిక్ పాలసీ, కెమిస్ట్రీ లేదా బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ), PGDM, MBAతో పాటు పని అనుభవం కలిగిన అభ్యర్థులు NOV 6 వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్: https://apeda.gov.in/
News October 24, 2025
దీపావళి టార్గెట్.. ఉగ్ర కుట్ర భగ్నం

దీపావళి వేళ విధ్వంసం సృష్టిద్దామనుకున్న ISIS కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. అద్నాన్ అనే పేరుగల ఇద్దరు ISIS ఆపరేటర్లను అరెస్ట్ చేశారు. సౌత్ ఢిల్లీలో దీపావళికి రద్దీగా ఉండే షాపింగ్ మాల్, పబ్లిక్ పార్క్లో దాడి చేసేందుకు సిద్ధమైన వీరిద్దరినీ ఢిల్లీ, భోపాల్లో అదుపులోకి తీసుకున్నారు. పేలుడు పదార్థాలు, టైమర్ వాచ్ స్వాధీనం చేసుకున్నారు. OCT 16నే వారిని అరెస్ట్ చేయగా తాజాగా వివరాలు వెల్లడించారు.
News October 24, 2025
స్లీపర్ బస్సులు బ్యాన్ చేయాలా?

AP: కర్నూలు బస్సు <<18088805>>ప్రమాద<<>> ఘటనతో స్లీపర్ బస్సుల్లో సేఫ్టీపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. వరుస ప్రమాదాలతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు. 8-9 అడుగుల ఎత్తు, సీట్ల మధ్య ఇరుకుగా ఉండటంతో ఎమర్జెన్సీ సమయంలో బయటికెళ్లడం కష్టమై ప్రాణనష్టం పెరుగుతోంది. వందలాది మంది మరణిస్తుండటంతో చైనా 2012లోనే స్లీపర్ బస్సులను బ్యాన్ చేసింది. మన దేశంలోనూ నిషేధించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీరేమంటారు?


