News December 17, 2024

దృష్టి మ‌ర‌ల్చేందుకే జ‌మిలి ఎన్నిక‌లు: ఉద్ధ‌వ్‌

image

దేశాన్ని ప‌ట్టిపీడిస్తున్న స‌మ‌స్య‌ల నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చేందుకే కేంద్రం జ‌మిలి ఎన్నిక‌ల బిల్లు తెచ్చింద‌ని ఉద్ధ‌వ్ ఠాక్రే విమ‌ర్శించారు. జ‌మిలి ఎన్నిక‌ల ప్ర‌తిపాద‌న‌ల‌ను అమ‌లు చేసే ముందు దేశంలో పార‌ద‌ర్శ‌క ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను తీసుకురావాల‌ని డిమాండ్ చేశారు. మ‌రోవైపు నాగ్‌పూర్‌లో జ‌రుగుతున్న‌ MH అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా CM ఫ‌డణవీస్‌ను ఉద్ధ‌వ్ క‌ల‌వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

Similar News

News December 9, 2025

ముగిసిన ‘అఖండ-2’ వివాదం!

image

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. నిన్న రాత్రి ఈరోస్ సంస్థతో 14 రీల్స్‌కు సానుకూల చర్చలు జరిగాయని తెలిపాయి. ఇవాళ కోర్టు విచారణలో ఇదే విషయాన్ని తెలియజేసి విడుదలకు అనుమతులు తీసుకుంటుందని వెల్లడించాయి. ఈ క్రమంలో 12న విడుదల, 11న ప్రీమియర్స్ ప్రదర్శించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇవాళ ఉ.10.30కు మద్రాస్ కోర్టులో విచారణ జరగనుంది.

News December 9, 2025

రేపు ఉద్యోగులతో పవన్ మాటామంతీ

image

AP: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో డిప్యూటీ సీఎం పవన్ రేపు ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. మంగళగిరిలోని ఓ కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తోన్న కార్యక్రమాలను ఆయన వారికి వివరిస్తారు. అలాగే ఎలాంటి విధానాలు పాటిస్తే గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలమో తెలుసుకోనున్నారు. అవినీతిరహిత పాలనను అందించేందుకు సహకరించాలని కోరనున్నారు.

News December 9, 2025

టీ20ల్లో మనదే డామినేషన్.. కానీ!

image

టీ20ల్లో ఓవరాల్‌గా దక్షిణాఫ్రికాపై టీమ్ ఇండియా డామినేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 31 T20 మ్యాచులు జరగగా భారత్ 18, SA 12 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచులో ఫలితం రాలేదు. అయితే సొంతగడ్డపై ఆడిన 12 మ్యాచుల్లో ఇండియా ఐదింట్లో నెగ్గగా దక్షిణాఫ్రికా ఆరు మ్యాచుల్లో గెలిచింది. మరో మ్యాచ్‌లో రిజల్ట్ రాలేదు. కాగా కటక్‌లో ఆడిన రెండు టీ20ల్లో దక్షిణాఫ్రికానే విజయం సాధించడం గమనార్హం.