News June 27, 2024

బైజూస్ మాకు ₹13 కోట్లు బాకీ ఉంది: ఒప్పో

image

తమ ఫోన్లలో బైజూస్ యాప్ ప్రీఇన్‌స్టాల్ చేసినందుకు ఆ సంస్థ తమకు ₹13కోట్లు బాకీ ఉందని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్‌కు ఒప్పో తెలియజేసింది. బైజూస్ ప్రమోటర్లు దేశం విడిచి వెళ్లిపోయే అవకాశం ఉన్నందున దీనిపై తక్షణమే చర్యలు చేపట్టాలని కోరింది. కాగా విచారణను జులై 3కు వాయిదా వేసిన NCLT ఆ రోజును ‘బైజూస్ డే’గా పేర్కొంది. బైజూస్‌పై దాఖలైన 10 పిటిషన్ల విచారణ ఆ రోజు జరగనుండటమే కారణం.

Similar News

News September 18, 2025

నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

APలోని రాయలసీమలో ఒకటి, రెండుచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA హెచ్చరించింది. కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, GNT, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అటు TGలోని HYDలో సాయంత్రం మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD పేర్కొంది.

News September 18, 2025

‘OG’ టికెట్ ధరల పెంపు.. YCP శ్రేణుల ఫైర్

image

పవన్ కళ్యాణ్ OG సినిమా <<17742687>>టికెట్<<>> రేట్లను పెంచడంపై వైసీపీ శ్రేణులు ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. బెనెఫిట్ షోకు ఏకంగా రూ.1,000 (జీఎస్టీ కలుపుకుని) ఏంటని ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ తన సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అయితే పుష్ప-2 సినిమా టికెట్ ధరలను సైతం (రూ.800+GST) పెంచిన విషయం గుర్తు లేదా అని పవన్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News September 18, 2025

మళ్లీ భారత్vsపాకిస్థాన్ మ్యాచ్.. ఎప్పుడంటే?

image

ఆసియా కప్-2025లో భారత్vsపాకిస్థాన్ మరోసారి తలపడనున్నాయి. సూపర్-4లో ఈ ఆదివారం (Sep 21) రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటికే గ్రూప్ స్టేజీలో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోరంగా ఓడింది. కాగా గ్రూప్-A నుంచి భారత్, పాక్ సూపర్-4కు క్వాలిఫై అయ్యాయి. సూపర్-4లో ఒక్కో జట్టు 3 మ్యాచులు ఆడనుంది. అటు గ్రూప్-Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ సూపర్-4 రేసులో ఉన్నాయి.