News March 16, 2024
సీఏఏ అమలు ఇప్పటికే ఆలస్యమైంది: జగ్గీ వాసుదేవ్

సీఏఏపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టం అమలు ఆలస్యమైందన్నారు. ‘విభజనప్పుడు పొరుగు దేశాల్లో స్థిరపడిన ప్రజలకు సమస్యలు ఎదురైతే మళ్లీ తిరిగి తీసుకొస్తామని నాటి నేతలు హామీ ఇచ్చారు. 75ఏళ్లలో వారు ఎన్నో కష్టాలు అనుభవించారు. 30-40ఏళ్ల క్రితమే కొందరు భారత్ వచ్చినా ఇంకా శరణార్థులుగానే ఉన్నారు. ఇందుకు సిగ్గుగా లేదా?’ అని ప్రశ్నించారు.
Similar News
News December 15, 2025
పెరగనున్న టీవీల ధరలు!

కొత్త ఏడాదిలో TVల ధరలు పెరిగే అవకాశం ఉంది. మెమొరీ చిప్ల కొరత, రూపాయి పతనం, దిగుమతి వ్యయాలు పెరగడం ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో జనవరిలో 3 నుంచి 10% వరకు టీవీల ధరలు పెరగొచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కొన్ని తయారీ కంపెనీలు డీలర్లకు ఈ విషయం తెలియజేశాయని పేర్కొంటున్నాయి. గత మూడేళ్లలో మెమొరీ చిప్ల ధరలు 500% ఎగిశాయని, వచ్చే 6 నెలలూ పెరిగే అవకాశం ఉందని వెల్లడించాయి.
News December 15, 2025
AP న్యూస్ రౌండప్

* నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామాను కలెక్టర్ హిమాన్షు ఆమోదించారు. త్వరలో కొత్త మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం.
* రఘురామకృష్ణరాజును హింసించారనే ఆరోపణల కేసులో ఐపీఎస్ సునీల్ కుమార్ ఇవాళ గుంటూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకానున్నారు.
* ఏపీ లిక్కర్ కేసులో బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్రెడ్డి, ధనుంజయ్ బెయిల్ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
News December 15, 2025
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేడు బాధ్యతలు చేపట్టనున్న నితిన్

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బిహార్ మంత్రి నితిన్ నబీన్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా నితిన్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బిహార్ నుంచి నియమితులైన తొలి వ్యక్తిగా, పిన్న వయస్కుడిగానూ ఆయన నిలిచారు. త్వరలోనే నితిన్ను జాతీయ అధ్యక్షుడిగా నియమించే అవకాశముందని తెలుస్తోంది.


