News January 17, 2025
సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై క్యాబినెట్లో చర్చ

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రతిపాదనలు, సచివాలయాల్లో RTGS ఏర్పాటుపై CM చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్లో చర్చ జరిగింది. అటు నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై మంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. వైసీపీ హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు ప్రభుత్వం గుర్తించింది. వాటిపై ప్రభుత్వానికి మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది.
Similar News
News November 18, 2025
NABFINSలో ఉద్యోగాలు

<
News November 18, 2025
తిరుమల వైభవాన్ని చాటే మహాద్వార గోపురం

శ్రీవారి ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారమే మహద్వార గోపురం. దీన్నే ముఖద్వారం, పడికావలి గోపురమని కూడా అంటారు. సుమారు 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ గోపురం 50ft ఎత్తుతో, 5 అంతస్తులతో ఉంటుంది. దీని శిఖరంపై 7 కలశాలు అలరారుతుంటాయి. మహాప్రాకారానికి తొలి ప్రవేశ ద్వారం ఇదే. అద్భుతమైన ఈ శిల్పకళా రూపం, భక్తులకు స్వామి దర్శనానికి ముందు ఆధ్యాత్మిక అనుభూతిని అందించి, ఆలయ దివ్య వైభవానికి అద్దం పడుతుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 18, 2025
NABFINSలో ఉద్యోగాలు

<


