News January 11, 2025
సంక్రాంతి తర్వాత క్యాబినెట్ విస్తరణ: TPCC చీఫ్

TG: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ సంక్రాంతి తర్వాత ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ను మారుస్తున్నారన్న వార్తలపై తనకు సమాచారం లేదన్నారు. బలమైన నాయకులు ఉన్న నియోజకవర్గాల్లో చేరికలను ప్రోత్సహించబోమని తెలిపారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతు ఇస్తామని ప్రకటించారు.
Similar News
News October 15, 2025
ఓట్ల చోరీతో గెలిచింది బీఆర్ఎస్సే: శ్రీధర్

TG: జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. అసలు ఓటు చోరీతో గెలిచిందే BRS పార్టీయని <<18006137>>కేటీఆర్<<>> వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. గతంలో MLC ఎన్నికల్లో ఓట్ల చోరీ చేసి గెలిచిందని ఆయన విమర్శించారు. అర్హత లేని విద్యార్థులను ఓటర్లుగా చేర్చారని ఆరోపించారు. మరోవైపు మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, సమస్య ఉంటే పరిష్కారం చూపేందుకు పీసీసీ చీఫ్, CM ఉన్నారని తెలిపారు.
News October 15, 2025
13 జిల్లాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు(1/2)

AP: ఖరీఫ్ సీజన్ పత్తి సేకరణకు ప్రభుత్వం 13 జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇక్కడ మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేస్తారు. ☛ విజయనగరం జిల్లాలోని రాజాం
☛ మన్యం జిల్లాలో సాలూరు, పాలకొండ(భామిని)
☛ కాకినాడ జిల్లాలో పిఠాపురం ☛ ఏలూరు జిల్లాలో చింతలపూడి (జంగారెడ్డిగూడెం)
☛ NTR జిల్లాలో నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరు (గంపలగూడెం, ఏ కొండూరు), కంచికచర్ల
News October 15, 2025
13 జిల్లాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు (2/2)

☛ గుంటూరు జిల్లాలో ఫిరంగిపురం, ప్రత్తిపాడు, తాడికొండ, గుంటూరు ☛ పల్నాడు జిల్లాలో మాచర్ల, పిడుగురాళ్ల, గురజాల (నడికుడి), క్రోసూరు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, నరసరావుపేట ☛ బాపట్లలో పర్చూరు (పర్చూరు, మార్టూరు)
☛ ప్రకాశంలో మార్కాపురం ☛ కడపలో ప్రొద్దుటూరు
☛ అనంతపురంలో గుత్తి, తాడిపత్రి,
☛ నంద్యాలలో నంద్యాల ☛ కర్నూలులో ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు(పెంచికలపాడు), మంత్రాలయంలో పత్తిని కొనుగోలు చేస్తారు.