News October 29, 2024
క్యాబినెట్ విస్తరణ అప్పుడే..: సీఎం రేవంత్

TG: మహారాష్ట్ర ఎన్నికల తర్వాత క్యాబినెట్ విస్తరణ చేపడతామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. తనకు అధిష్ఠానం(ఏఐసీసీ)తో గ్యాప్ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏఐసీసీ అంటే తానేనని మీడియాతో చిట్చాట్లో ఆయన పేర్కొన్నారు. రోజులో ఎనిమిది గంటలు మూసీపైనే పని చేస్తున్నానని తెలిపారు. హైడ్రా వల్లే HYDలో రియల్ ఎస్టేట్ పడిపోయిందన్న ప్రచారాన్ని ఖండించారు. దేశవ్యాప్తంగా ‘రియల్’ రంగంలో స్తబ్దత ఏర్పడిందని CM చెప్పారు.
Similar News
News October 25, 2025
ఎర్రిస్వామి గురించి అప్పుడే తెలిసింది: ఎస్పీ

AP: కర్నూలు బస్సు ప్రమాదంపై SP విక్రాంత్ పాటిల్ మరిన్ని విషయాలు వెల్లడించారు. ‘బైక్పై మరో వ్యక్తి ఉన్నాడని తెలిసి తుగ్గలి వెళ్లి ఆరా తీశాం. అప్పుడే ఎర్రిస్వామి గురించి తెలిసింది. అతడు HYD GHMCలో పనిచేస్తున్నట్లు గుర్తించాం. ఎర్రిస్వామిని ఇంటి వద్ద దిగబెట్టేందుకు వెళ్తుండగా వర్షం వల్ల బైక్ స్కిడ్ అయింది. బస్సులో 250 స్మార్ట్ఫోన్ల రవాణాపై FSL నివేదిక తర్వాత స్పష్టత వస్తుంది’ అని వెల్లడించారు.
News October 25, 2025
7,267 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో 7,267 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించారు. OCT 23తో అప్లై గడువు ముగియగా.. OCT 28 వరకు పొడిగించారు. PGT, TGT, వార్డెన్(M, F), స్టాఫ్ నర్స్(F) తదితర పోస్టులున్నాయి. పోస్టును బట్టి PG, B.Ed, డిగ్రీ, BSc నర్సింగ్, ఇంటర్, టెన్త్ పాసైన వారు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వెబ్సైట్: https://nests.tribal.gov.in
News October 25, 2025
WWC: భారత్ సెమీస్లో తలపడేది ఈ జట్టుతోనే

AUSతో మ్యాచ్లో SA ఘోర ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన SA 97 రన్స్కే ఆలౌట్ కాగా AUS 16.5 ఓవర్లలోనే టార్గెట్ను ఛేదించింది. 13 పాయింట్లతో టాప్ ప్లేస్ను ఖాయం చేసుకుంది. భారత్ రేపు బంగ్లాతో జరిగే చివరి మ్యాచ్లో గెలిచినా నాలుగో ప్లేస్లోనే ఉంటుంది. దీంతో ఈనెల 30న రెండో సెమీఫైనల్లో పటిష్ఠ AUSతో IND తలపడనుంది. ఈ గండం గట్టెక్కితేనే తొలి WCకు భారత్ చేరువవుతుంది. తొలి సెమీస్లో SA, ENG తలపడతాయి.


