News October 23, 2024
క్యాబినెట్ సమావేశం ప్రారంభం
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఇసుక సీనరేజ్ రద్దు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, కొత్త రేషన్ కార్డుల జారీ, కొత్త మద్యం పాలసీ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, గత ప్రభుత్వ భూ కేటాయింపులు, వాలంటీర్ల కొనసాగింపు, రేషన్ డీలర్ల నియామకం, పోలవరం పనులు, దేవాలయాల పాలక మండలి సంఖ్య పెంపు, అమరావతిలో ప్రాజెక్టుల నిర్మాణం సహా పలు అంశాలపై చర్చించనుంది.
Similar News
News October 23, 2024
ఆయిల్ ట్యాంకర్లో ఇదేంది భయ్యా!
బిహార్లో ‘పుష్ప’ రేంజ్లో స్మగ్లింగ్ వెలుగుచూసింది. ముజఫర్పూర్లో హిందుస్థాన్ పెట్రోలియం ట్యాంకర్పై అనుమానం వచ్చిన పోలీసులు వెంబడించగా నిందితులు ఆ వాహనాన్ని జాతీయరహదారిపై వదిలి పరారయ్యారు. ట్యాంకర్ ఓపెన్ చేసి చూస్తే అందులో మద్యం కాటన్లు ఉన్నాయి. మద్యం అరుణాచల్ప్రదేశ్లో తయారైనట్లు పోలీసులు గుర్తించారు. బిహార్లో లిక్కర్ అమ్మకాలు నిషేధం. అందుకే స్మగ్లర్లు ఇలా తప్పుడు దారులు ఎంచుకుంటున్నారు.
News October 23, 2024
వయనాడ్: ప్రియాంకా గాంధీని ఢీకొంటున్న ‘యాక్సిడెంటల్ పొలిటీషియన్’
ప్రియాంకా గాంధీతో తలపడుతున్న BJP అభ్యర్థి నవ్యా హరిదాస్ది కోజికోడ్. వీరి కుటుంబానికి సంఘ్తో అనుబంధం ఉంది. 2009లో పెళ్లయ్యాక సింగపూర్కు వెళ్లిన నవ్య సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేశారు. 2015లో కోజికోడ్ ట్రిప్కు వచ్చి లోకల్బాడీ ఎలక్షన్లో పోటీ చేశారు. ఓడితే సింగపూర్ వెళ్దామనుకున్న ఆమె వరుసగా 2 సార్లు గెలిచి పార్టీలో ఎదిగారు. 2021లో కోజికోడ్ సౌత్ నుంచి MLAగా ఓడినా BJP ఓట్ల శాతం17-21కి పెంచారు.
News October 23, 2024
భారీ వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక
బంగాళాఖాతంలో ‘దానా’ తుఫాన్ కారణంగా APలో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో తీరం వెంట గంటకు 80-90KM వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయంది. ఇవాళ, రేపు సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తలు తీసుకోవాలంది. రేపు అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాములోపు తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది.