News December 19, 2024
క్యాబినెట్ భేటీ ప్రారంభం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. 21 అంశాలపై క్యాబినెట్ అజెండా రూపొందించగా, వాటిపై మంత్రులు చర్చిస్తున్నారు. సీఆర్డీఏ అనుమతించిన పనులకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. వీటితో పాటు వివిధ పరిశ్రమలకు భూకేటాయింపులపైనా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అటు, అమరావతిలో భాగస్వామ్యం కావాలని సీఆర్డీఏ జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీలకు లేఖల ద్వారా ఆహ్వానం పలికింది.
Similar News
News December 4, 2025
రైతన్నా.. పంట వ్యర్థాలను తగలబెట్టొద్దు

పంటకాలం పూర్తయ్యాక చాలా మంది రైతులు ఆ వ్యర్థాలను తగలబెడుతుంటారు. వీటిని తొలగించడానికి అయ్యే ఖర్చును భరించలేక ఇలా చేస్తుంటారు. అయితే దీని వల్ల నేల సారం దెబ్బతినడంతో పాటు పంటకు మేలు చేసే కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వానపాములు, నులిపురుగులు నాశనమవుతాయి. ఫలితంగా పంట దిగుబడి తగ్గుతుంది. ఈ వ్యర్థాలను పంటకు మేలు చేసే ఎరువులుగా మార్చే సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 4, 2025
పాక్ దివాలా.. అమ్మకానికి జాతీయ ఎయిర్లైన్స్

IMF ప్యాకేజీ కోసం తమ జాతీయ ఎయిర్లైన్స్ను అమ్మడానికి పాకిస్థాన్ సిద్ధమైంది. పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(PIA) బిడ్డింగ్ ఈ నెల 23న జరుగుతుందని ఆ దేశ ప్రధాని షరీఫ్ ఓ ప్రకటనలో చెప్పారు. ‘PIAలో 51-100% విక్రయించడం అనేది IMF $7 బిలియన్ల ఆర్థిక ప్యాకేజీ కోసం నిర్దేశించిన షరతులలో భాగం. ఈ సేల్కు ఆర్మీ నియంత్రణలోని ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ కూడా ముందస్తు అర్హత సాధించింది’ అని అక్కడి మీడియా చెప్పింది.
News December 4, 2025
ఇతిహాసాలు క్విజ్ – 86

ఈరోజు ప్రశ్న: పార్వతీ దేవి అవతారంగా, శక్తి స్వరూపిణిగా, విష్ణుమూర్తి సోదరిగా పరిగణించబడే, ఈశ్వరుడు వివాహం చేసుకున్న దేవత ఎవరు? అలాగే, ఆమెకు తమిళనాడులో ఒక ప్రసిద్ధ ఆలయం కూడా ఉంది. ఆమెతో పాటు ఒక పచ్చ చిలుక కూడా కనిపిస్తుంది.
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం. ☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


