News October 23, 2024
ముగిసిన క్యాబినెట్ భేటీ
AP: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. భేటీ వివరాలను సీఎం చంద్రబాబు సాయంత్రం 4గంటలకు ప్రెస్మీట్లో వెల్లడించనున్నారు. ఇసుక, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, కొత్త రేషన్ కార్డుల జారీ, కొత్త మద్యం పాలసీ, అసెంబ్లీ సమావేశాలు, వాలంటీర్ల కొనసాగింపు, రేషన్ డీలర్ల నియామకం, పోలవరం, అమరావతిలో ప్రాజెక్టుల నిర్మాణం సహా పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.
Similar News
News October 23, 2024
GOOD NEWS: రూ.99కే లిక్కర్ వచ్చేసింది!
AP: రాష్ట్రంలో రూ.99కే క్వార్టర్ మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఒక్కో లిక్కర్ షాప్నకు 3 నుంచి 8 కేసులు మాత్రమే సరఫరా చేస్తుండగా, త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు వైన్స్ నిర్వాహకులు చెబుతున్నారు. షార్ట్స్ పేరుతో బ్రాండీ, విస్కీ విక్రయాలు కూడా జరుగుతున్నాయి. దీంతో మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
News October 23, 2024
గాజా యుద్ధాన్ని ముగించేందుకు ఇదే సమయం: అమెరికా
గాజా యుద్ధాన్ని ముగించేందుకు ఇజ్రాయెల్కు ఇదే సరైన సమయమని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ తాజాగా పేర్కొన్నారు. ఇరాన్తో ఉద్రిక్తతల్ని పెంచొద్దని ఆ దేశానికి సూచించారు. ‘గత ఏడాది అక్టోబరు 7 తర్వాతి నుంచి గాజా విషయంలో ఇజ్రాయెల్ నిర్దేశించుకున్న లక్ష్యాలన్నింటినీ సాధించింది. ఇప్పుడు ఆ విజయాలను శాశ్వతం చేసుకోవాలి. పరిస్థితి మరింత దిగజారనివ్వకూడదు. గాజాకిప్పుడు మానవతాసాయం అవసరం’ అని పేర్కొన్నారు.
News October 23, 2024
జట్టును నిర్ణయించేది సోషల్ మీడియా కాదు: గంభీర్
టీమ్ ఇండియాలో క్రికెటర్ KL.రాహుల్ చోటుపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కోచ్ గంభీర్ స్పందించారు. వాటితో తమకు అవసరం లేదని, మేనేజ్మెంట్ ఏం అనుకుంటుందనేదే తమకు ముఖ్యమన్నారు. జట్టును ఎంపిక చేసేది నెటిజన్లు కాదన్నారు. రాహుల్ మంచి ఫామ్లో ఉన్నారని, అతడు పెద్ద స్కోర్లు చేయాలని భావిస్తున్నాడని తనకు అనిపిస్తోందని గౌతీ చెప్పుకొచ్చారు. న్యూజిలాండ్తో రెండో టెస్టు రేపు ప్రారంభం కానుంది.