News January 2, 2025
ముగిసిన క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు

AP: చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రి వర్గ సమావేశం ముగిసింది. మున్సిపల్ చట్టసవరణ ఆర్డినెన్స్కు, అమరావతిలో రూ.2,733 కోట్ల పనులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు భవన నిర్మాణాలు, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో 19 పోస్టులకు ఆమోద ముద్ర వేసింది. తిరుపతిలో ఈఎస్ఐ ఆస్పత్రిని 100 పడకలకు పెంచడం, పత్తిపాడులో 100 పడకల ఈఎస్ఐ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Similar News
News December 1, 2025
అఫ్గాన్తో ట్రేడ్ వార్.. నష్టపోతున్న పాక్

అఫ్గాన్తో ట్రేడ్ వార్ పాక్ను కోలుకోలేని దెబ్బతీస్తోంది. ఆ దేశం నుంచి ఎగుమతులు, దిగుమతులు ఆపేయడంతో పాక్లోని సిమెంట్ ఇండస్ట్రీ నష్టపోతోంది. అఫ్గాన్ నుంచి కోల్ దిగుమతి లేకపోవడంతో సౌతాఫ్రికా, ఇండోనేషియా, మొజాంబిక్ నుంచి అధిక ధరలకు సిమెంట్ ఫ్యాక్టరీలు బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాయి. 48 రోజుల నుంచి బార్డర్లు క్లోజ్ కావడంతో మందులు, అగ్రికల్చర్ గూడ్స్తోపాటు పండ్లు, కూరగాయల ఎగుమతులు నిలిచిపోయాయి.
News December 1, 2025
పురుషులు, స్త్రీలు ఎంత నీరు తాగాలంటే?

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే సరిపడా నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. US అకాడమీస్ ఆఫ్ సైన్సెస్ ప్రకారం పురుషులు రోజుకు 3.7లీటర్లు, స్త్రీలు 2.7లీటర్ల మేర నీరు సేవించాలంటున్నారు. వయసు, బరువు, వాతావరణ పరిస్థితులను బట్టి ఇవి మారుతాయని, గర్భిణులు & పాలిచ్చే తల్లులు నీటిని ఎక్కువ సేవించాలని చెబుతున్నారు. తక్కువ నీరు తాగితే ‘హైడ్రేషన్’, ఎక్కువ సేవిస్తే ‘హైపోనాట్రేమియా’ సమస్యలొస్తాయంటున్నారు.
News December 1, 2025
సమంత-రాజ్ వివాహ ప్రక్రియ గురించి తెలుసా?

<<18437680>>సమంత-రాజ్<<>> ఈషా కేంద్రంలో ‘భూత శుద్ధి వివాహం’ ద్వారా ఒక్కటయ్యారు. ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచే పవిత్ర ప్రక్రియే ఇది. లింగ భైరవి లేదా ఎంపిక చేసిన ఆలయాల్లో ఈ తరహా క్రతువులు నిర్వహిస్తారు. దీంతో దంపతుల మధ్య సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత పెంపొందుతుందని విశ్వసిస్తారు. సద్గురు చేతుల మీదుగా ఈ లింగ భైరవి దేవి ప్రాణప్రతిష్ఠ జరిగింది.


