News January 2, 2025
ముగిసిన క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు

AP: చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రి వర్గ సమావేశం ముగిసింది. మున్సిపల్ చట్టసవరణ ఆర్డినెన్స్కు, అమరావతిలో రూ.2,733 కోట్ల పనులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు భవన నిర్మాణాలు, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో 19 పోస్టులకు ఆమోద ముద్ర వేసింది. తిరుపతిలో ఈఎస్ఐ ఆస్పత్రిని 100 పడకలకు పెంచడం, పత్తిపాడులో 100 పడకల ఈఎస్ఐ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Similar News
News November 28, 2025
భోగాపురం కనెక్టివిటీపై బ్రేకులు

భోగాపురం విమానాశ్రయానికి కనెక్టివిటీ మెరుగుపర్చేందుకు VMRDA ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ రహదారుల ప్రాజెక్ట్పై పురోగతి కనబడటం లేదు. VMRDA ఏడాది క్రితం రహదారుల నిర్మాణాలకు ప్రతిపాదనలు చేసింది. ట్రాఫిక్ను అరికట్టాలనే లక్ష్యంతో ప్లాన్ చేసినా.. భూసేకరణ, వివాదాలు పనులకు అడ్డంకిగా మారాయి. ఏడాది క్రితమే ప్రాసెస్ ప్రారంభమైనా పురోగతి కనబడకపోవడంతో ట్రాఫిక్ తిప్పలు తప్పవనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
News November 28, 2025
NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 28, 2025
సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.


