News April 3, 2025

ముగిసిన క్యాబినెట్ భేటీ.. కీలక అంశాలకు ఆమోదం

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీ ముగిసింది. పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది.
* ప్రత్యేక వాహక ప్రాజెక్టుగా పోలవరం-బనకచర్ల
* ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి డ్రోన్ కార్పొరేషన్‌ను విడదీసి స్వతంత్ర సంస్థ ఏర్పాటు
* అనకాపల్లి డీఎల్‌పురంలో ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ కంపెనీకి షరతులపై క్యాపిటల్ పోర్టు అప్పగింత
* త్రీస్టార్, ఆ పైబడిన హోటళ్ల బార్ లైసెన్స్ ఫీజులు రూ.25 లక్షలకు తగ్గింపు

Similar News

News October 28, 2025

రాష్ట్రంలో మెగా జాబ్ మేళా

image

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తుళ్లూరులోని CRDA ఆఫీస్, స్కిల్ హబ్ వద్ద రేపు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 10 మల్టీ నేషనల్ కంపెనీలు 400 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. నిరుద్యోగ అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రెజ్యూమ్, సర్టిఫికెట్లు తీసుకుని ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు.

News October 28, 2025

నిత్యారాధన ఫలితాలు

image

శివ మహాపురాణం ప్రకారం.. నిత్యారాధన విశేష ఫలితాలనిస్తుంది. ఆదివారం సూర్యారాధన నేత్ర, శిరో, చర్మ రోగాలను పోగొడుతుంది. అన్నదానం చేయడం శుభకరం. సంపద కోసం సోమవారం లక్ష్మీదేవిని, రోగ నివారణకై మంగళవారం కాళిని, కుటుంబ క్షేమం కోసం బుధవారం విష్ణువును, ఆయువుకై గురువారం, భోగాలకై శుక్రవారం సకల దేవతలను, అపమృత్యువు నివారణకై శనివారం రుద్రాది దేవతలను పూజించాలి. ఈ నిత్యారాధనలు మనకు సకల శుభాలు కలిగిస్తాయి. <<-se>>#SIVOHAM<<>>

News October 28, 2025

ఈ మందు ‘యమ’ డేంజర్

image

TG: రాష్ట్రంలో ఆత్మహత్యలకు వినియోగిస్తున్న పారాక్వాట్ గడ్డిమందును బ్యాన్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొన్నిగంటల్లోనే గడ్డిని మాడిపోయేలా చేసే ఈ మందును రైతులు వాడతారు. అయితే ఆత్మహత్యలకూ వినియోగించడం ఆందోళన కలిగిస్తోంది. ఇది తాగిన వెంటనే కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. విరుగుడు లేకపోవడంతో 98% కేసుల్లో మరణాలు సంభవిస్తున్నాయి. మన దేశం కేరళ, ఒడిశాతో పాటు 32దేశాల్లో నిషేధం ఉంది.