News April 10, 2025
15న మంత్రివర్గ భేటీ.. కీలక పథకాలకు ఆమోదం?

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 15న సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. దీంతో రేపు సా.4 గంటల్లోగా అన్ని శాఖలు తమ ప్రతిపాదనలను పంపాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. కాగా క్యాబినెట్ భేటీలో మెగా డీఎస్సీతోపాటు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు, పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించే అవకాశం ఉంది.
Similar News
News October 27, 2025
CSIR-CCMBలో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ 4 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 29 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానుండగా.. నవంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని నవంబర్ 28 వరకు స్పీడ్ పోస్ట్ చేయాలి. వెబ్సైట్: https://www.ccmb.res.in/
News October 27, 2025
కాస్త రిలీఫ్.. తగ్గిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రేట్ రూ.1,140 తగ్గి రూ.1,24,480కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ.1,050 దిగివచ్చి రూ.1,14,100గా ఉంది. ఇటీవల ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధరలు కాస్త తగ్గడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది. అటు రేట్లు తగ్గడంపై పెట్టుబడిదారులు నిరాశకు గురవుతున్నారు. మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ రూ.1,70,000గా ఉంది.
News October 27, 2025
లాభాల్లో స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో వారం ప్రారంభంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు లాభపడి 84,506 వద్ద, నిఫ్టీ 90 పాయింట్లు వృద్ధి చెంది 25,885 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. మెటల్, బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. టాటా స్టీల్, రిలయన్స్, ఎయిర్టెల్, SBI, HDFC, టెక్ మహీంద్రా, NTPC, ICICI, యాక్సిస్ బ్యాంక్ షేర్లు టాప్ గెయినర్లుగా ఉన్నాయి.


