News April 10, 2025
15న మంత్రివర్గ భేటీ.. కీలక పథకాలకు ఆమోదం?

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 15న సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. దీంతో రేపు సా.4 గంటల్లోగా అన్ని శాఖలు తమ ప్రతిపాదనలను పంపాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. కాగా క్యాబినెట్ భేటీలో మెగా డీఎస్సీతోపాటు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు, పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించే అవకాశం ఉంది.
Similar News
News April 18, 2025
IPL: అనూహ్య ‘నో బాల్’.. ఎలాగంటే?

నిన్న MI, SRH మ్యాచ్లో ఓ అనూహ్య నో బాల్ వెలుగులోకి వచ్చింది. అన్సారీ బౌలింగ్లో రికెల్టన్ షాట్ ఆడగా కమిన్స్ క్యాచ్ పట్టారు. అయితే, బ్యాటర్ ఔట్ కాలేదు. దీనికి కారణం నో బాల్. రూల్ ప్రకారం బ్యాట్ను బంతి తాకక ముందే కీపర్ గ్లౌవ్స్ స్టంప్స్ కంటే ముందుకొస్తే నో బాల్ ఇస్తారు. నిన్న క్లాసెన్ గ్లౌవ్స్ ఇలాగే ముందుకొచ్చాయి. అయితే, కీపర్ తప్పునకు బౌలర్కు శిక్ష ఏంటని పలువురు క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు.
News April 18, 2025
సినిమాలు వదిలేస్తున్నట్లు ప్రచారం.. డైరెక్టర్ బూతు పురాణం!

తాను సినిమాలు తీయడం మానేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఖండించారు. ‘నేను ఫిల్మ్ మేకింగ్ను వదిలేయట్లేదు. షారుఖ్ ఖాన్ కంటే బిజీగా ఉన్నా. 2028 వరకు డేట్స్ ఖాళీ లేవు. 5 సినిమాలు డైరెక్ట్ చేస్తున్నా. త్వరలోనే రిలీజ్ అవుతాయి. నేను నిరాశతో ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయానని అనుకునే వాళ్లందరూ మీది మీరు..’ అంటూ అసభ్య పదజాలంతో <
News April 18, 2025
భారీగా తగ్గిన ధరలు.. కేజీ రూ.10

తెలుగు రాష్ట్రాల్లో టమాటా రేట్లు భారీగా పడిపోవడంతో గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతున్నారు. క్వింటా కనీస ధర రూ.800, గరిష్ఠ ధర రూ.1,480 పలుకుతోంది. వారం క్రితం గరిష్ఠ ధర రూ.1,800 నుంచి రూ.2,300 వరకు ఉంది. ఈ సీజన్లో సాగు పెరగడం, క్వాలిటీ లేకపోవడం ధరల పతనానికి కారణాలుగా చెబుతున్నారు. కనీస మద్దతు ధర రూ.1,500 ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. బహిరంగ మార్కెట్లో టమాటా కేజీ రూ.10-20గా ఉంది.