News April 10, 2025

15న మంత్రివర్గ భేటీ.. కీలక పథకాలకు ఆమోదం?

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 15న సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. దీంతో రేపు సా.4 గంటల్లోగా అన్ని శాఖలు తమ ప్రతిపాదనలను పంపాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. కాగా క్యాబినెట్ భేటీలో మెగా డీఎస్సీతోపాటు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు, పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించే అవకాశం ఉంది.

Similar News

News November 24, 2025

హనుమాన్ చాలీసా భావం – 19

image

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ ।
జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥
సూర్యుడిని పండుగా భావించి ఆకాశంలో ఎగిరిన బలవంతుడు హనుమ. అలాంటిది శ్రీరాముని ఉంగరంతో సముద్రాన్ని దాటడం ఆశ్చర్యాన్ని కలిగించదు. హనుమంతుని అద్భుత శక్తులు తెలిసిన తర్వాత సముద్ర లంఘనం ఆయనకు ఎంతో సులువు అని కవి ఉద్దేశం. దైవకార్య సాధనలో ఎంత కష్టమైన పనైనా సునాయసంగా పూర్తవుతుందనే సందేశం ఈ దోహా ఇస్తోంది. <<-se>>#HANUMANCHALISA<<>>

News November 24, 2025

INDSETIలో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు

image

ఇండియన్ బ్యాంక్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ <>(INDSETI<<>>) ఆఫీస్ అసిస్టెంట్ కోసం దరఖాస్తులు కోరుతోంది. BSW/BA/B.COM అర్హతగల వారు DEC 6వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 22-40ఏళ్ల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.20,000-రూ.27,500 చెల్లిస్తారు. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.indianbank.bank.in/

News November 24, 2025

ఇలా అయితే టార్గెట్ రీచ్ అవ్వడం మరింత ఆలస్యం

image

డాలర్‌తో రూపాయి విలువ క్రమంగా పడిపోతుండటంతో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి ఇండియాకు అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘2024లో $1కి రూ.82లు సమానం ఉండగా, ప్రస్తుతం సుమారు రూ. 90కి చేరింది. రూపాయి బలహీనపడటం వల్ల డాలర్లలో లెక్కించిన భారత GDP విలువ తగ్గి, ఈ లక్ష్యం నెరవేరడం ఆలస్యం అవుతుంది’ అని చెబుతున్నారు.