News April 10, 2025
15న మంత్రివర్గ భేటీ.. కీలక పథకాలకు ఆమోదం?

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 15న సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. దీంతో రేపు సా.4 గంటల్లోగా అన్ని శాఖలు తమ ప్రతిపాదనలను పంపాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. కాగా క్యాబినెట్ భేటీలో మెగా డీఎస్సీతోపాటు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు, పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించే అవకాశం ఉంది.
Similar News
News November 10, 2025
ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు

TG: కవి అందెశ్రీ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ను ఆదేశించారు. అందెశ్రీ అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం జరిగే అవకాశం ఉంది. ఆయన రచించిన ‘జయజయహే తెలంగాణ’ పాటను రేవంత్ సర్కార్ రాష్ట్ర గీతంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
News November 10, 2025
ప్రస్థానత్రయం అంటే ఏమిటి?

హిందూ తత్వశాస్త్రంలో అత్యంత ప్రామాణిక గ్రంథాలైన ఉపనిషత్తులు(శ్రుతి ప్రస్థానం), బ్రహ్మ సూత్రాలు(న్యాయ ప్రస్థానం), భగవద్గీత (స్మృతి ప్రస్థానం).. ఈ మూడింటిని కలిపి ‘ప్రస్థానత్రయం’ అంటారు. ఇవి జ్ఞాన మార్గానికి దారులుగా పరిగణిస్తారు. ముఖ్య సిద్ధాంతాలకు ఇదే ఆధారం. ప్రతి ఆచార్యుడు తమ సిద్ధాంతాలను స్థాపించడానికి వీటిపై భాష్యం రాయడం తప్పనిసరి. ఇవి బ్రహ్మ జ్ఞానాన్ని బోధించే అత్యున్నత గ్రంథాలు. <<-se>>#VedikVibes<<>>
News November 10, 2025
ఎయిమ్స్ భువనేశ్వర్లో 132 పోస్టులు

ఎయిమ్స్ భువనేశ్వర్ 132 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 13 నుంచి 27 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎండీ/ డీఎన్బీ/ఎంఎస్/ డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://aiimsbhubaneswar.nic.in


