News September 4, 2025
నేడు క్యాబినెట్ భేటీ.. వీటిపై కీలక చర్చ

AP: CM చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ ఇవాళ భేటీ కానుంది. అమరావతికి సంబంధించి ఇటీవల జరిగిన SIPB, CRDA సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించనుంది. రాజధానిలో భూసేకరణ జరిపేందుకు CRDAకు పాలనపరమైన అనుమతులు మంజూరు చేయనుంది. రూ.53వేల కోట్ల పెట్టుబడులు, 83వేల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పలు పరిశ్రమలకు అనుమతులు ఇవ్వనుంది. అలాగే ఈనెల 18 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్పై చర్చించనుంది.
Similar News
News September 4, 2025
అమెరికాలో ఆర్థిక మాంద్యం తప్పదా?

అమెరికా ఆర్థిక మాంద్యం అంచున ఉందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ‘మూడీస్’ చీఫ్ ఎకనామిస్ట్ మార్క్ జండీ తెలిపారు. ప్రస్తుత ద్రవ్యోల్బణం 2.7% ఉంటే అది వచ్చే ఏడాదికి 3%-4%కి పెరిగే అవకాశం ఉందని చెప్పారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, ఉద్యోగాలు పోతున్నాయని పేర్కొన్నారు. టారిఫ్స్ పెంచడంతో అమెరికా కంపెనీలు నష్టపోతున్నాయని వివరించారు. కాగా 2008 మాంద్యాన్ని అంచనా వేసిన తొలి ఆర్థికవేత్త ఈయనే.
News September 4, 2025
దేశానికి ఇదే నిజమైన దీపావళి కానుక: పవన్

AP: GST సంస్కరణలను Dy.CM పవన్ స్వాగతించారు. ‘స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఇచ్చిన మాటను PM మోదీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఈ మార్పులతో పేద, మధ్య తరగతి, రైతులకు చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా విద్య, జీవిత బీమాపై GST తొలగింపు కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది. దేశానికి ఇదే నిజమైన దీపావళి కానుక. నిర్మలా సీతారామన్, జీఎస్టీ కౌన్సిల్కు ప్రత్యేక ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.
News September 4, 2025
భారత జట్టుకు దూరం.. భువి రియాక్షన్ ఇదే!

జాతీయ జట్టుకు ఎంపికవడం తన చేతుల్లో లేదని, దానిపై సెలక్టర్లు నిర్ణయం తీసుకుంటారని భారత బౌలర్ భువనేశ్వర్ అన్నారు. ‘మైదానంలో బాగా ఆడటం, ఫిట్గా ఉండటం, బౌలింగ్ చేసేటప్పుడు లైన్&లెంగ్త్పైనే నా ఫోకస్ ఉంటుంది. కొన్నిసార్లు ఎంత బాగా ఆడినా అదృష్టం కలిసిరాదు. అవకాశం వస్తే స్టేట్, జాతీయ జట్లకు నా బెస్ట్ ఇస్తా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. భువి IND తరఫున చివరగా 2022 నవంబర్లో NZతో జరిగిన T20 మ్యాచులో ఆడారు.