News January 2, 2025

రైతు భరోసాపై నేడు క్యాబినెట్ సమావేశం

image

TG: రైతు భరోసాపై క్యాబినెట్ సబ్‌కమిటీ నేడు సమావేశం కానుంది. సచివాలయంలో ఉదయం 11గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మంత్రులు తుమ్మల, ఉత్తమ్, శ్రీధర్ బాబు పాల్గొంటారని సమాచారం. రైతు భరోసా విధివిధానాలను ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. సంక్రాంతికి ముందే రైతు భరోసాను విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News October 16, 2025

వారంలోగా వాస్తవాలు తెలపండి: కృష్ణా బోర్డు

image

AP: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు DPR తయారీకి జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్‌పై వారంలో వాస్తవాలు తెలపాలని రాష్ట్రాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది. DPR, ప్రాజెక్టు పనులన్నీంటినీ ఆపాలని TG ENC అంజాద్ ఇటీవల CWCకి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు ఫీజిబిలిటీ నివేదికను తిరస్కరించేలా CWCని ఆదేశించాలని కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ రాసినట్లు వివరించారు. ఈ క్రమంలోనే బోర్డు స్పందించి తాజా ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.

News October 16, 2025

‘మిత్ర మండలి’ రివ్యూ&రేటింగ్

image

తండ్రి కులాంతర పెళ్లికి ఒప్పుకోడని హీరోయిన్ (నిహారిక) ఇంటి నుంచి పారిపోవడం, దీంతో ఆమె ఫ్రెండ్స్ పడిన ఇబ్బందులే స్టోరీ. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణుల కామెడీ అక్కడక్కడా మినహా చాలాచోట్ల రుద్దినట్లు అనిపిస్తుంది. సత్య యాక్టింగ్ రిలీఫ్ ఇస్తుంది. బ్రహ్మానందం ఓ పాటలో మెరిశారు. నవ్వించాలనే సెటప్ చేసుకున్నా డైరెక్టర్ విజయేందర్ సక్సెస్ కాలేదు. కథ, స్క్రీన్‌ప్లే, సాంగ్స్, BGM తేలిపోయాయి.
రేటింగ్: 1.75/5.

News October 16, 2025

లవకుశుల్లో ఎవరు పెద్దవారు?

image

లవకుశులు కవలలన్న విషయం మనకు తెలిసిందే. ఈ జంట పదాల్లో లవుడి పేరు ముందుండటం వల్ల లవుడు పెద్దవాడని అనుకుంటారు. కానీ అనేక పురాణాలు కుశుడు పెద్దవాడని చెబుతున్నాయి. కవలల్లో ముందు జన్మించిన వారిని పెద్దవారిగా పరిగణిస్తారు. రామాయణ గాథలు కుశుడే ముందు జన్మించినట్లు పేర్కొంటున్నాయి. దీన్ని బట్టి కుశుడు పెద్దవాడని చెప్పవచ్చు. అయితే కుశుడిని, వాల్మీకీ తన మాయా శక్తితో సృష్టించాడన్న కథనాలు కూడా ఉన్నాయి.