News July 6, 2024
రైతుల అభిప్రాయాలు సేకరించనున్న కేబినెట్ సబ్ కమిటీ
TG: రైతుభరోసా విధివిధానాలు రూపొందించడంపై మంత్రివర్గ ఉపసంఘం రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించనుంది. ఈ నెల 11 నుంచి 16 వరకు అన్ని జిల్లాల్లో రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రోజుకు మూడు సమావేశాల చొప్పున జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో రైతులతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. 5ఎకరాలు కటాఫ్ పెట్టాలనే దానిపై చర్చించనున్నారు. 16వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం మరోసారి భేటీ కానుంది.
Similar News
News October 5, 2024
‘RG కర్’ మృతురాలి ఫొటో వెల్లడించిన వారికి నోటీసులు
కోల్కతాలోని RG కర్ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి హత్యాచారం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో మృతురాలి వివరాలను, ఫొటోను సోషల్ మీడియాలో పలువురు వెల్లడించారు. అలాంటి 25మందిని కోల్కతా పోలీసులు గుర్తించి నోటీసులు పంపించినట్లు సమాచారం. వీటిలో కొన్ని బంగ్లాదేశ్ నుంచి కూడా నడుస్తున్నాయని తెలుస్తోంది. ఐపీ అడ్రెస్ ఆధారంగా వాటిని ట్రేస్ చేస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి.
News October 5, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 5, 2024
అక్టోబర్ 5: చరిత్రలో ఈరోజు
1911: నటి, గాయని పసుపులేటి కన్నాంబ జననం
1975 : హాలీవుడ్ నటి కేట్ విన్స్లెట్ జననం
2001 : ఖాదీ ఉద్యమ నాయకురాలు కల్లూరి తులశమ్మ మరణం
2011 : యాపిల్ సంస్థ సహవ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ మరణం
1864 : కలకత్తాలో సంభవించిన పెను తుపానులో 60,000 మందికి పైగా మృతి
* ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం