News July 1, 2024
వైద్యుల రక్షణ గురించి కేబినెట్లో చర్చిస్తా: పవన్ కళ్యాణ్

AP: నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా వైద్య వృత్తిలో ఉన్న ప్రతి డాక్టర్కు డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మానవాళిపై కరోనా విరుచుకుపడినప్పుడు డాక్టర్లు అందించిన సేవలు విస్మరించలేం. కరోనాతో దేశంలో 1600 మంది వైద్యులు చనిపోయారు. దురదృష్టవశాత్తూ ఇటీవల వైద్యులు, ఆస్పత్రులపైనా దాడులు జరుగుతున్నాయి. వైద్యులకు రక్షణ కల్పించే అంశాన్ని కేబినెట్ ముందుకు తీసుకెళ్తా’ అని పవన్ హామీ ఇచ్చారు.
Similar News
News February 20, 2026
ఇది వరి లాంటి కలుపు మొక్క

వరి చేనులో ‘బొంత ఊద’ కలుపు మొక్కలు కలవరపెడుతున్నాయి. ఇవి కూడా వరి మాదిరిగానే పెరుగుతాయి. పూర్తిగా పెరిగే వరకు వీటిని గుర్తుపట్టలేము. అందుకే దీన్ని దొంగ వరి అంటారు. పంటకు అందించే పోషకాలను ఇవి గ్రహించి వరి కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతాయి. ఈ కలుపు మొక్కల వల్ల వరిలో పొడ తెగులు, సుడిదోమ ఉద్ధృతి పెరుగుతుందని రైతులు అంటున్నారు. వరిలో ఇలాంటి కలుపును గుర్తిస్తే నిపుణుల సూచనల మేరకు మందులు వాడి నిర్మూలించండి.
News February 20, 2026
బెంగళూరు- BZA మధ్య వందేభారత్ వేయండి.. స్పందించిన లోకేశ్

బెంగళూరులో ఉంటున్న కోస్తాంధ్ర టెకీల రైలు కష్టాలపై ఏపీ మంత్రి లోకేశ్ సానుకూలంగా స్పందించారు. బెంగళూరు నుంచి విజయవాడకు వందేభారత్ రైలు కావాలని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఈ అంశాన్ని రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్తామని లోకేశ్ భరోసానిచ్చారు. వెంటనే చర్యలు తీసుకోవాలని MP కేశినేని చిన్నిని కోరారు. ‘వందేభారత్ స్లీపర్’ రైలు తీసుకొచ్చేలా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్తో చర్చలు జరుపుతున్నట్లు MP తెలిపారు.
News February 20, 2026
RITES లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<


