News September 25, 2024

భక్తుల సూచనల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు: MLA సుజనా

image

AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాల పోస్టర్‌ను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి, వెనిగండ్ల రాము ఆవిష్కరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే సుజనా చెప్పారు. భక్తుల సూచనల కోసం కాల్ సెంటర్ సైతం అందుబాటులోకి తెస్తామన్నారు. కాగా అక్టోబర్ 3 నుంచి 12 వరకు ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు.

Similar News

News December 20, 2025

సండే ‘బడ్జెట్’!

image

దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఈసారి సెలవు రోజైన ఆదివారం(2026 FEB 1) ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. 2017 నుంచి బడ్జెట్‌ను FEB 1న ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తుండటమే దీనికి కారణం. పార్లమెంట్ సండే జరగడం అరుదైన విషయమే అయినా, ఈసారి నిర్వహించే ఛాన్స్ ఉందని అధికారవర్గాలు తెలిపాయి. దీనిపై కేంద్ర మంత్రి రిజిజు మాట్లాడుతూ.. సరైన సమయంలో క్యాబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

News December 20, 2025

కలుపుతో వ్యవసాయానికి ముప్పు.. నివారణ ఎలా?

image

వ్యవసాయంలో రైతులు ఎదుర్కొనే అతి పెద్ద సమస్య కలుపు. వయ్యారిభామ, లింగ మిర్యాల, తుంగ, బంగారు తీగ సహా ఇతర కలుపు మొక్కలు పొలంలో పెరిగి.. ప్రధాన పంటకు అందించే పోషకాలను, ఎరువులను గ్రహించి దిగుబడిని గణనీయంగా తగ్గిస్తున్నాయి. కొన్ని వైరస్‌లకు ఆశ్రయమిచ్చి పంటల్లో తెగుళ్ల వ్యాప్తికి కారణమవుతున్నాయి. వయ్యారి భామ సహా వివిధ కలుపు మొక్కల నివారణకు సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News December 20, 2025

బిగ్‌బాస్ విజేత ఎవరు?

image

బిగ్‌బాస్-9 విజేత ఎవరో రేపు తేలిపోనుంది. ఇవాళ్టి నుంచి టాప్-5 కంటెస్టెంట్లు ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, తనూజ, డెమాన్, సంజనలో ముగ్గురు ఎలిమినేట్ కానున్నారు. చివరికి టాప్-2లో నిలిచే ఇద్దరిలో విన్నర్‌ను ప్రకటిస్తారు. ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ పూర్తవగా కళ్యాణ్ టాప్ ప్లేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అటు తొలిసారి ఫీమేల్ విజేతగా తనూజ నిలవనున్నారని ప్రచారం జరుగుతోంది. విన్నర్ ఎవరవుతారో మీరూ గెస్ చేయండి.