News April 6, 2024

15 లక్షల ఈవీఎంలు మిస్ అంటూ ప్రచారం.. ఈసీ ఖండన

image

ఎన్నికల వేళ ఈసీ పేరుతో ఫేక్ ప్రచారాలు జరుగుతున్నాయి. తాజాగా దేశంలో 15 లక్షల ఈవీఎంలు మిస్ అయినట్లు సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు. దీన్ని ఈసీ ఖండించింది. ‘ఈ ప్రచారం తప్పు. ఈవీఎంలు ఎక్కడా మిస్ కాలేదు. ఇదే అంశంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. అధికారిక సమాచారం కోసం <>https://www.eci.gov.in/<<>> వెబ్‌సైట్‌లో చూడగలరు’ అని ట్వీట్ చేసింది.

Similar News

News February 2, 2026

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

image

నిన్న భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 332 పాయింట్ల లాభంతో 81055కు చేరగా నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో 24,886 వద్ద ట్రేడవుతోంది. L&T, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, ఎటర్నల్, పవర్ గ్రిడ్, రిలయన్స్ స్టాక్స్ లాభాల్లో ట్రేడవుతున్నాయి.

News February 2, 2026

భారీగా తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రా. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.9,050 తగ్గి రూ.1,51,530కు చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల పసిడి రూ.8,300 తగ్గి రూ.1,38,900 పలుకుతోంది.

News February 2, 2026

వేరుశనగలో అంతర పంటలతో లాభాలేంటి?

image

వర్షాభావ పరిస్థితులు, బెట్ట, కరవు పరిస్థితులు ఏర్పడి ప్రధాన పంట అయిన వేరుశనగ నష్టపోయినా.. అంతర పంటల నుంచి కొంత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. వేరుశనగ, అంతరపంటల వేరువ్యవస్థ పొడవులో తేడాల వల్ల భూమిలోని పోషకాలు, నీటిని పంటలు సమర్థవంతంగా వినియోగించుకునే వీలుంటుంది. చీడపీడల ఉనికి చాలావరకు తగ్గుతుంది. వర్షపునీటిని పొలంలోనే ఇంకేటట్లు చేయడంలో, నేలకోతను నివారించడంలో అంతరపంటలు కీలకపాత్ర పోషిస్తాయి.