News August 7, 2025
భర్తకు భార్య రాఖీ కట్టొచ్చా?

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల పవిత్ర బంధానికి ప్రతీక రాఖీ. అయితే కేవలం సోదరులకే కాదు భర్తలకు రాఖీ కట్టే ఆచారాన్ని మధ్యప్రదేశ్ చింద్వాడా సహా పలు ప్రాంతాల్లో పాటిస్తున్నారు. ఇంద్రుడికి భార్య ఇంద్రాణి రాఖీ కట్టినట్లు పురాణాలు చెబుతున్నాయి. ‘పెళ్లంటే బాధ్యత. భార్యకు ఒక రక్షకుడిలా తోడుగా ఉంటానంటూ భర్త చేసే ప్రతిజ్ఞ’ అని గుర్తు చేస్తూ మహిళలు భర్తలకు రాఖీ కడుతుంటారు. మరి మీ దగ్గర ఈ పద్ధతి ఉందా? COMMENT
Similar News
News August 7, 2025
GOOD NEWS.. వారికి రూ.25,000

AP: చేనేత కార్మికుల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి DBV స్వామి చెప్పారు. నేతన్న భరోసా కింద త్వరలోనే వారికి రూ.25,000 ఇస్తామని ప్రకటించారు. అందమైన వస్త్రాలు నేసి సమాజానికి నేతన్నలు నాగరికత నేర్పించారని ప్రశంసించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేటి నుంచి చేతి మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందించే పథకం ప్రారంభిస్తున్నామన్నారు.
News August 7, 2025
ఈ ‘స్వామి’ ఆకలి కేకలను దూరం చేశాడు

భారత రత్న, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ MS స్వామినాథన్ 3 పదుల వయసులోనే దేశ భవిష్యత్ మార్చారు. కరవుతో అల్లాడుతున్న ప్రజలకు కాంతిరేఖలా మారారు. జపాన్, US, మెక్సికో శాస్త్రవేత్తలతో కలిసి వరి, గోధుమ వంగడాలపై ఆయన చేసిన పరిశోధనలు ఆకలి కేకలను దూరం చేశాయి. ఆ తర్వాత భారత్ వెనుతిరిగి చూడలేదు. విదేశాలకు ఆహార ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందాం.
News August 7, 2025
రేషన్ లబ్ధిదారులకు నిరాశ

AP: రేషన్ షాపుల్లో కందిపప్పు ఈ నెల కూడా పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు. కొంతకాలంగా సరఫరా నిలిచిపోగా, పండుగల సీజన్ కావడంతో ఈసారి ఇస్తారని అంతా భావించారు. షాపులకు వెళ్లాక అసలు విషయం తెలిసి అసంతృప్తి చెందుతున్నారు. కొన్నిచోట్ల అరకొరగా పంపిణీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లో KG ₹120 ఉండటంతో రేషన్ షాపుల్లో పంపిణీ చేయాలని కోరుతున్నారు. మీకు కందిపప్పు అందిందా? కామెంట్ చేయండి.