News October 8, 2025
చికిత్స తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ తిరిగి వస్తుందా?

మహిళలు ఎదుర్కొంటున్న ప్రమాదకర క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. అయితే చికిత్స తర్వాత క్యాన్సర్ తగ్గిపోయినట్టు కనిపించినా కొన్నిసార్లు తిరిగిరావొచ్చంటున్నారు నిపుణులు. కొన్ని క్యాన్సర్ కణాలు నిద్రాణ స్థితిలో ఉండి గుర్తించలేనివిగా ఉంటాయి. కాబట్టి చికిత్స తర్వాత కూడా చెకప్లు చేయించుకోవాలి. అలాగే శరీరంలో ఏవైనా అసాధారణమైన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. <<-se>>#WomenHealth<<>>
Similar News
News October 8, 2025
యూనివర్సిటీలకు వీసీల నియామకం

AP: రాష్ట్రంలోని ఐదు యూనివర్సిటీలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వైస్ ఛాన్స్లర్లను నియమించారు.
* ఆచార్య నాగార్జున- వెంకట సత్యనారాయణ రాజు
* శ్రీ వెంకటేశ్వర- టాటా నర్సింగరావు
* వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్- బి.జయరామి రెడ్డి
* జేఎన్టీయూ(విజయనగరం)- వి.వెంకట సుబ్బారావు
* యోగి వేమన (కడప)- రాజశేఖర్ బెల్లంకొండ
News October 8, 2025
విద్యా సంస్థల సమ్మె వాయిదా

TG: ఈనెల 13 నుంచి సమ్మెకు దిగుతామన్న ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య కాస్త వెనక్కి తగ్గింది. CMతో చర్చిస్తామని ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి హామీ ఇవ్వడంతో సమాఖ్య ప్రతినిధులు సమ్మెను వాయిదా వేశారు. దీపావళిలోగా రూ.300 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. దీంతో OCT 13 నుంచి ప్రారంభం కావాల్సిన సమ్మె, కళాశాలల బంద్ కార్యక్రమాన్ని OCT 23కు వాయిదా వేయాలని నిర్ణయించారు.
News October 8, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ ఉదయంతో పోల్చితే సాయంత్రానికి భారీగా పెరిగాయి. HYD బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఉదయం రూ.1,150 పెరగ్గా ఇప్పుడు మరో రూ.760 ఎగిసి రూ.1,23,930కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ఉదయం రూ.1,050 ఎగబాకగా సాయంత్రానికి మరో రూ.700 పెరిగి రూ.1,13,600 పలుకుతోంది. అటు KG వెండి ధర మార్నింగ్ రూ.100 తగ్గగా ఇప్పుడు రూ.3000 పెరిగి రూ.1,70,000కి చేరుకుంది.