News March 23, 2024
లిక్కర్ స్కామ్తో సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా?: కిషన్రెడ్డి

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్తో తమ కుటుంబానికి సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా అని రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్రెడ్డి ప్రశ్నించారు. ‘లిక్కర్ స్కామ్లో అన్ని ఆధారాలు ఉన్నాయి. ఢిల్లీలో తీగ లాగితే హైదరాబాద్లో డొంక కదులుతోంది. కేజ్రీవాల్ సీఎం అయితే అవినీతిని విడిచిపెట్టాలా? తెలంగాణ లిక్కర్ మోడల్నే ఢిల్లీకి బదిలీ చేశారు. దర్యాప్తు సంస్థలు దోషుల్ని అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు ఎలా అవుతుంది?’ అని అన్నారు.
Similar News
News November 9, 2025
శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలో భక్తులు ఉన్నారు. నిన్న వేంకటేశ్వరుడిని 80,560 మంది దర్శించుకున్నారు. 31,195 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ ఆదాయం రూ.3.22 కోట్లు లభించింది. కాగా ఇవాళ సుప్రభాత సేవలో పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఏడుకొండలవాడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
News November 9, 2025
ప్రీమెచ్యూర్ మెనోపాజ్ గురించి తెలుసా?

40 ఏళ్ల కంటే ముందే రుతుక్రమం ఆగిపోతే, దీన్ని ‘ప్రీమెచ్యూర్ మెనోపాజ్’ అంటారు. ప్రపంచంలో ఇతర మహిళల కంటే భారతీయ మహిళళ్లో ప్రీమెచ్యూర్ మెనోపాజ్ రేటు కాస్త ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళల ఆర్థికస్థితి, పోషకాహార లోపం, కుటుంబంలో మానసిక ఒత్తిడి, పెళ్లి చిన్న వయసులోనే అవ్వడం, విడాకులు వంటివి మహిళలలో ప్రీమెచ్యూర్ మెనోపాజ్కు కారణమవుతాయి. కీమోథెరపీ, రేడియోథెరపీ లాంటివి దీనికి కారణం కావొచ్చు.
News November 9, 2025
గ్రూప్-3.. రేపటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్

TG: 1,388 గ్రూప్-3 ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ రేపటి నుంచి ఈ నెల 26 వరకు కొనసాగనుంది. నాంపల్లిలోని తెలుగు వర్సిటీలో రోజూ 10.30AM నుంచి 1.30PM, తిరిగి 2PM నుంచి 5.30PM వరకు పరిశీలన జరగనుంది. విద్యార్హత సర్టిఫికెట్లు, హాల్టికెట్, ఆధార్/ఏదైనా ప్రభుత్వ ఐడీ, అప్లికేషన్ ఫామ్ తదితర పత్రాలను తీసుకెళ్లాలి. పూర్తి వివరాలకు https://www.tgpsc.gov.in/ సంప్రదించవచ్చు.


