News March 18, 2024
రెండు పార్టీలను చీల్చి అధికారంలోకి తిరిగివచ్చా: ఫడ్నవీస్

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “2019లో బీజేపీ ఓటమి తర్వాత ‘నేను మళ్లీ తిరిగొస్తా’ అని అప్పుడు చేసిన ప్రచారాన్ని ఎద్దేవా చేశారు. కానీ తర్వాత రెండు పార్టీలను చీల్చి అధికారంలోకి వచ్చాను. ఇద్దరు స్నేహితులనూ వెంట తెచ్చుకున్నా. పవర్లోకి రావడానికి రెండున్నరేళ్లు పట్టింది” అని తెలిపారు. కాగా ఏక్నాథ్ షిండే వల్ల శివసేన, అజిత్ పవార్తో NCP చీలిపోయిన సంగతి తెలిసిందే.
Similar News
News October 27, 2025
భూ వినియోగ మార్పిడికి ఇక నుంచి ఆన్లైన్లోనే అనుమతులు

AP: భూ వినియోగ మార్పులకు (చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్) ఇక నుంచి ఆన్లైన్లోనే అనుమతులు మంజూరు కానున్నాయి. డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్(DPMS) పోర్టల్ ద్వారా అప్లై చేసుకున్న 45 రోజుల్లోగా అనుమతులిస్తారు. రియల్ ఎస్టేట్ సంస్థలు, వ్యక్తులు ఆన్లైన్ దరఖాస్తుకు రూ.10 వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను విడుదల చేసింది.
News October 27, 2025
కుక్కలా పని చేస్తున్నారంటూ పోస్ట్.. థాంక్స్ చెప్పిన ట్రంప్

US కోసం ట్రంప్ కుక్కలా పని చేస్తున్నారని ఉన్న ఓ SM పోస్ట్ను ట్రంప్ తన ట్రూత్ సోషల్ అకౌంట్లో షేర్ చేశారు. ‘థాంక్యూ.. అమెరికా గొప్ప పురోగతి సాధిస్తుంది’ అని దానికి క్యాప్షన్ ఇచ్చారు. ‘ఎలాంటి డబ్బు ఆశించకుండా ట్రంప్ కుక్కలా పని చేస్తున్నారు. అయినా ఆయన త్యాగాన్ని ఈ దేశం గుర్తించట్లేదు’ అని ఆ పోస్టులో రాసి ఉంది. దీంతో ట్రంప్ తనకు తానే లవ్ లెటర్స్ రాసుకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
News October 27, 2025
పిలవని పేరంటానికి అందుకే వెళ్లొద్దంటారు

పిలవని పేరంటానికి వెళ్లడం ఆపదనే తెస్తుందనడానికి సతీదేవి కథే నిదర్శనం. దక్షుడు యాగానికి శివుడిని, సతీదేవిని ఆహ్వానించలేదు. అయినా పుట్టింటిపై మమకారంతో సతీదేవి భర్త శివుడి మాటను కాదని, బలవంతంగా ఆ యాగశాలకు వెళ్లింది. అక్కడ దక్షుడు శివుడిని అవమానించడం చూసి, ఆ అవమానాన్ని భరించలేకపోయింది. యోగాగ్నిలో దేహత్యాగం చేసింది. పిలవని చోటికి వెళ్లడం వల్ల ఎంతటి నష్టం కలుగుతుందో ఈ ఘటన మనకు చెబుతోంది.<<-se>>#Shakthipeetham<<>>


