News March 18, 2024

రెండు పార్టీలను చీల్చి అధికారంలోకి తిరిగివచ్చా: ఫడ్నవీస్

image

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “2019లో బీజేపీ ఓటమి తర్వాత ‘నేను మళ్లీ తిరిగొస్తా’ అని అప్పుడు చేసిన ప్రచారాన్ని ఎద్దేవా చేశారు. కానీ తర్వాత రెండు పార్టీలను చీల్చి అధికారంలోకి వచ్చాను. ఇద్దరు స్నేహితులనూ వెంట తెచ్చుకున్నా. పవర్‌లోకి రావడానికి రెండున్నరేళ్లు పట్టింది” అని తెలిపారు. కాగా ఏక్‌నాథ్ షిండే వల్ల శివసేన, అజిత్ పవార్‌తో NCP చీలిపోయిన సంగతి తెలిసిందే.

Similar News

News August 16, 2025

‘కూలీ’కి రూ.20 కోట్లు.. ఆమిర్ ఏమన్నారంటే?

image

రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కూలీ’ కోసం తాను రూ.20కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆమిర్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ కోసం రూపాయి కూడా తీసుకోలేదని వెల్లడించారు. రజినీతో కలిసి తెరపై కనిపించడమే పెద్ద రివార్డు అని, తాను అతిథి పాత్రలో నటించినట్లు తెలిపారు. చిత్రంలో రజినీ, నాగార్జున అసలైన హీరోలన్నారు. ఈ మూవీ ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

News August 16, 2025

అమ్మాయిలకు ఫ్రీగా స్కూటీలు.. కేంద్రం ఏమందంటే?

image

కేంద్ర ప్రభుత్వం దేశంలోని మహిళలు, యువతులకు ఉచితంగా స్కూటీలను అందిస్తుందని, అప్లై చేసుకోండని జరుగుతున్న ప్రచారాన్ని ‘PIBFactCheck’ ఖండించింది. కేంద్రం ఇలాంటి ‘ఫ్రీ స్కూటీ స్కీమ్’ను తీసుకురాలేదని స్పష్టం చేసింది. ఇలాంటి విషయాలను ఎవరైనా షేర్ చేస్తే ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్స్‌లో చెక్ చేసి నిర్ధారించుకోవాలని సూచించింది. ఇతరులకు మీరు షేర్ చేసే ముందు నిజాన్ని తెలుసుకోవాలని కోరింది.

News August 16, 2025

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి.. పోలవరానికి మరో నీతా: KTR

image

TG: KCRపై కక్షతో ‘కాళేశ్వరం’పై కాంగ్రెస్, BJP చేస్తున్న కుట్రలను కాలరాస్తామని KTR అన్నారు. ‘జాతీయ హోదా ఇచ్చి మరీ NDA ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం కాఫర్ డ్యామ్ రెండోసారి కొట్టుకుపోయినా NDSAకు కనిపించడం లేదా? మేడిగడ్డలో 2 పిల్లర్లకు పగుళ్లు వస్తే కూలేశ్వరం అని కారుకూతలు కూసిన INC, BJP నేతలకు పోలవరాన్ని కూలవరం అనే ధైర్యం ఉందా? కాళేశ్వరానికి ఒక నీతి.. పోలవరానికి మరో నీతా?’ అని Xలో ప్రశ్నించారు.