News April 2, 2024
ఇంటికి పేరును మారిస్తే సొంతమైపోతుందా?: జైశంకర్

అరుణాచల్ ప్రదేశ్లో 30 ప్రాంతాలకు చైనా పేర్లు మార్చడంపై విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ఘాటుగా స్పందించారు. ‘నేనొచ్చి ఒకరి ఇంటికి ఉన్న పేరును మార్చేస్తే, ఆ ఇల్లు నాదవుతుందా? అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే. పేర్లు మార్చడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు. వాస్తవాధీన రేఖ వద్ద మన సైన్యం కాపలా ఉంది’ అని గుర్తుచేశారు.
Similar News
News March 26, 2026
రోజులో 2 గంటలు ట్రాఫిక్లోనే టెకీ జీవితం

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCCs) విస్తరణతో హైదరాబాద్ ఐటీ రంగం దూసుకుపోతోంది. అయితే ఇది ఉద్యోగుల ప్రయాణ సమయాన్ని పెంచేసిందని తాజా నివేదిక వెల్లడించింది. HYDలో ఒక్క ఐటీ ఉద్యోగి ఒకవైపు ప్రయాణానికే సగటున 59.5 నిమిషాలు వెచ్చిస్తున్నారు. అంటే రోజుకు దాదాపు రెండు గంటలు రోడ్ల మీద ట్రాఫిక్లోనే గడిచిపోతోంది. బెంగళూరు(67.5M), ఢిల్లీ(67.5M) స్థాయిలో హైదరాబాద్లోనూ ప్రయాణ సమయం పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
News March 26, 2026
GK: భారతదేశ భౌగోళిక విశేషాలు

*అతి పొడవైన నది- గంగా నది
* అతి పెద్ద రాష్ట్రం (వైశాల్యం)- రాజస్థాన్
* అతి పెద్ద రాష్ట్రం (జనాభా)- ఉత్తర్ప్రదేశ్
* అతి ఎత్తైన శిఖరం – కాంచనజంగ
* అతి పెద్ద ఎడారి – థార్ ఎడారి (రాజస్థాన్)
* అతి పొడవైన తీరరేఖ గల రాష్ట్రం- గుజరాత్
* అతి ఎత్తైన డ్యామ్ – తెహ్రీ డ్యామ్(ఉత్తరాఖండ్)
* అతి పొడవైన డ్యామ్ – హీరాకుడ్ డ్యామ్ (ఒడిశా)
* సౌత్ఇండియాలో పొడవైన నది- గోదావరి
News March 26, 2026
రాజధాని పేరుతో అమరావతిలో అవినీతి యజ్ఞం: సజ్జల

AP: అమరావతి చట్టబద్ధతకు అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఏంటని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అలాగైతే మండలిలోనూ చర్చ పెట్టాలన్నారు. అమరావతిలో CM చంద్రబాబు అవినీతి యజ్ఞం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిపై జగన్కు అభ్యంతరం లేదని, అందుకే CBN కంటే ముందే భూమి కొనుక్కొని ఆఫీస్, ఇల్లు కట్టుకున్నట్లు చెప్పారు. రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతిని ఆయన వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.


