News May 22, 2024
సీఎం వ్యాఖ్యల కంటే హాస్యాస్పదం మరొకటి ఉంటుందా?: స్వాతి

తనపై దాడి కేసును పారదర్శకంగా విచారించాలన్న ఢిల్లీ CM కేజ్రీవాల్ వ్యాఖ్యల కంటే హాస్యాస్పదం మరొకటి ఉంటుందా? అని ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ ప్రశ్నించారు. మాటలు, చేతలు ఒకేలా ఉండాలని ఆమె సూచించారు. ‘స్వయంగా సీఎం డ్రాయింగ్ రూమ్లోనే నన్ను కొట్టారు. అప్పటి నుంచి నేను న్యాయం కోసం పోరాడుతున్నా. ఇప్పుడు సీఎం పారదర్శక విచారణ కోసం అడుగుతున్నారు. దీన్ని నేను నమ్మను’ అని స్వాతి ట్వీట్ చేశారు.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


