News October 23, 2024
USలో ఎన్నికల ప్రచారానికి వెళ్తే డబ్బిస్తారా?

మన దగ్గర ఎన్నికల ప్రచారానికి వెళితే బీరు, బిర్యానీ, డబ్బు ఇస్తారనేది ఏ పార్టీ ఒప్పుకోకపోయినా అదే నిజం. అయితే అమెరికాలో మాత్రం కాస్త భిన్నంగా ఉంటుందని అక్కడి భారతీయులంటున్నారు. ప్రచారానికి వచ్చిన వారికి భోజనం, ప్రయాణ ఖర్చులు ఇస్తారని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లి డబ్బు తీసుకోవాలనే ఆలోచన ఎవరికీ ఉండదంటున్నారు. పైగా ‘ఫండ్ రైజింగ్ మీటింగ్స్’ పేరుతో జనాల నుంచే డబ్బు తీసుకుంటారంటున్నారు.
Similar News
News October 28, 2025
మరికాసేపట్లో తీవ్ర తుఫానుగా ‘మొంథా’!

AP: ‘మొంథా’ తుఫాను దూసుకొస్తోంది. గడిచిన 6గంటల్లో 17kmph వేగంతో కదులుతున్నట్లు APSDMA తెలిపింది. ప్రస్తుతం మచిలీపట్నంకి 230KM, కాకినాడకు 310KM, విశాఖపట్నంకి 370KM దూరంలో కేంద్రీకృతమైందని చెప్పింది. మరికాసేపట్లో తీవ్ర తుఫానుగా బలపడనుందని వివరించింది. రాత్రికి మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరం దాటే ఛాన్స్ ఉందని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని హెచ్చరించింది.
News October 28, 2025
ఇతిహాసాలు క్విజ్ – 49

1. శ్రీరామదాసుగా ప్రసిద్ధి చెందిన రామ భక్తుడు ఎవరు?
2. భూలోకానికి పైన ఉండే మొదటి లోకం ఏది?
3. రామ సేతువు నిర్మాణంలో ప్రధాన ఇంజినీర్లు ఎవరు?
4. యుద్ధాన్ని చూస్తూ దాన్ని ధృతరాష్ట్రునికి వివరించింది ఎవరు?
5. శివుడు తన జటాజూటంలో బంధించిన నది ఏది?
✑ సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 28, 2025
అక్టోబరు ఆఖరు నుంచి మామిడి చెట్లకు నీరు వద్దు

మామిడిలో మంచి పూత రావాలంటే రైతులు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అందులో భాగంగా ఇప్పటికే చెట్లకు పోషకాలు అందించాల్సి ఉంటుంది. ఈ నెల చివరి నుంచి మామిడి చెట్లు నిద్రావస్థలో ఉంటాయి. అందుకే ఈ నెలాఖరు నుంచి మామిడి చెట్లకు నీరు పెట్టడం పూర్తిగా ఆపేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాలంలో చెట్లకు నీరు పెట్టడం వల్ల చెట్ల రెమ్మల్లో కొత్త ఇగుర్లు వచ్చి పూత రాకుండా పోతుందని చెబుతున్నారు.


