News October 26, 2025
ప్రెగ్నెన్సీలో పానీపూరి తింటున్నారా?

పండంటి బిడ్డకు జన్మనివ్వాలంటే ప్రెగ్నెన్సీలో సమతుల ఆహారం తీసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. అయితే చాలామంది క్రేవింగ్స్ పేరుతో ఫాస్ట్ఫుడ్స్, స్వీట్స్ వంటివి అతిగా తీసుకుంటారు. ముఖ్యంగా పానీపూరి, ఫాస్ట్ఫుడ్, బిర్యానీ వంటివి అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తారు. వీటిని తింటే విరేచనాలు, వాంతులు, డీహైడ్రేషన్ సమస్యలొస్తాయంటున్నారు. వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసిన ఆహారమే తినాలని సూచిస్తున్నారు.
Similar News
News October 26, 2025
కర్నూలు ప్రమాదం.. శివశంకర్ ఫోన్తో ఎర్రిస్వామి ఆచూకీ!

కర్నూలు <<18087387>>దుర్ఘటనకు<<>> సంబంధించి శివశంకర్ సెల్ఫోన్ ద్వారా అతడి ఫ్రెండ్ ఎర్రిస్వామి ఆచూకీని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ప్రమాదం తర్వాత శివశంకర్ బాడీని పక్కకు జరిపి, అతడి సెల్ఫోన్ను ఎర్రిస్వామి తీసుకెళ్లాడని సమాచారం. ఘటనా స్థలిలో శివశంకర్ ఫోన్ లభించకపోవడంతో నంబర్ను పోలీసులు ట్రేస్ చేశారు. రాంపల్లిలో<<18100306>> ఎర్రిస్వామి వద్ద<<>> ఉందని గుర్తించి అతడిని అదుపులోకి తీసుకుని వివరాలు రాబట్టారు.
News October 26, 2025
తుఫాను వేళ ఎండ.. దేనికి సంకేతమో తెలుసా?

AP: ఇవాళ 8-9AM మధ్య పార్వతీపురం జిల్లాలో గరిష్ఠంగా 34.7, NTR జిల్లాలో 34.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం సమయానికి మరో 2-3 డిగ్రీల టెంపరేచర్ పెరిగే అవకాశం ఉంది. మొంథా తుఫాన్ ఏపీకి 800 KM దూరంలో ఉండటంతో ఆ ప్రభావం ఇప్పుడే కనిపించదని, 300 KMల దగ్గరకు చేరగానే వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. ఇవాళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే భూమి వేడెక్కి తుఫాన్ ప్రభావం అధికమవుతుందని చెప్పారు.
News October 26, 2025
డాక్టర్ ఆత్మహత్య కేసు.. ప్రధాన నిందితుడు అరెస్టు

మహారాష్ట్రలోని సతారాలో SI తనను రేప్ చేశాడంటూ <<18091644>>డాక్టర్ ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐ గోపాల్ బదానే అరెస్టయ్యారు. ఫల్టాన్ పోలీస్ స్టేషన్కు వచ్చి గోపాల్ లొంగిపోయారని ఎస్పీ తుషార్ దోషి తెలిపారు. అతడిని సతారా జిల్లా కోర్టులో హాజరుపరచగా 4 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించినట్లు తెలిపారు. కాగా అంతకుముందు మరో నిందితుడు ప్రశాంత్ బంకర్ను అదుపులోకి తీసుకున్నారు.


