News April 5, 2024
అధికారంలోకి వస్తే అగ్నివీర్ స్కీం రద్దు: చిదంబరం

తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడుతామని కాంగ్రెస్ నేత చిదంబరం చెప్పారు. రిజర్వేషన్లపై 50శాతం పరిమితి ఎత్తివేత, రైల్వేల ప్రైవేటీకరణ నిలిపివేత, అగ్నివీర్ స్కీం రద్దు, ఇంధన ధరల తగ్గింపు చేస్తామన్నారు. సంపద సృష్టించాలంటే వృద్ధి రేటు పెరగాలని.. మోదీ పాలనలో అలా జరగలేదన్నారు. ఐదేళ్లుగా వేతనాలు పెరగలేదన్నారు. యూపీఏ హయాంలో వృద్ధి రేటు 7.8గా ఉంటే.. ఎన్డీఏ హయాంలో గత పదేళ్లలో 5.8గానే ఉందన్నారు.
Similar News
News December 13, 2025
APPLY NOW: డిగ్రీ అర్హతతో 451 పోస్టులు

UPSC త్రివిధ దళాల్లో 451 పోస్టులను కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2026 ద్వారా భర్తీ చేయనుంది. ఇంజినీరింగ్, డిగ్రీ అర్హతగల వారు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 20 -24ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.200, SC, ST, మహిళలకు ఫీజు లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://upsconline.nic.in. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 13, 2025
మెస్సీ మ్యాచ్.. 3,000 మంది పోలీసులతో భద్రత

HYD ఉప్పల్ స్టేడియంలో ఈరోజు రా.7.30 గంటలకు జరిగే రేవంత్vsమెస్సీ ఫుట్బాల్ మ్యాచుకు టికెట్ ఉన్న వారినే అనుమతించనున్నారు. ఈ మ్యాచుకు 3,000 మంది పోలీసులతో భారీ భద్రత కల్పిస్తున్నట్లు రాచకొండ CP సుధీర్ బాబు తెలిపారు. 450 CC కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షించనున్నారు. 20ని.ల పాటు జరిగే ఈ ఫ్రెండ్లీ మ్యాచులో CM రేవంత్ ‘సింగరేణి RR9’ కెప్టెన్గా వ్యవహరిస్తారు. మ్యాచ్ తర్వాత మెస్సీతో పెనాల్టీ షూటౌట్ ఉంటుంది.
News December 13, 2025
కాకినాడ జిల్లాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<


