News October 3, 2024
రేపటి నుంచి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు: TTD ఈవో

AP: తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. వాహన సేవలు ఉ. 8గంటలకు, రాత్రి 7గంటలకు నిర్వహిస్తామని TTD ఈవో శ్యామలరావు తెలిపారు. 8వ తేదీ రాత్రి గరుడ వాహన సేవ జరుగుతుందని పేర్కొన్నారు. 3.5 లక్షల మంది వస్తారని అంచనా వేసినట్లు చెప్పారు. 7లక్షల లడ్డూలు సిద్ధం చేశామన్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 4 నుంచి 12వ తేదీ వరకు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు చెప్పారు.
Similar News
News December 26, 2025
భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL)లో ఉద్యోగాలు.. అప్లైకి 3 రోజులే సమయం

<
News December 26, 2025
కూరగాయల పంటకు తెగుళ్ల నుంచి సహజ రక్షణ

పొలం చుట్టూ, గట్ల వెంబడి ఎలాంటి కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. అలాగే పొలం చుట్టూ గట్ల వెంబడి, నాటుకు కనీసం రెండు వారాల ముందు 3-4 వరుసల్లో మొక్కజొన్న పంటను కంచే పంటగా నాటుకోవాలి. దీనివలన ఈ మొక్కలు కూరగాయ పంటకు ప్రహారీలా ఉండి, పక్క పొలాల నుంచి పురుగులు రాకుండా రక్షణ కల్పిస్తాయి. మొక్కజొన్న మొక్కల్లో వచ్చిన కంకులను విక్రయించడం ద్వారా రైతుకు అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది.
News December 26, 2025
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీ వెండి రేటు రూ.9,000 పెరిగి రూ.2,54,000కు చేరింది. అటు 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.770 పెరిగి రూ.1,40,020కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రూ.700 పెరిగి రూ.1,28,350 పలుకుతోంది.


