News June 30, 2024

1 నుంచి 8 తరగతుల ఉమ్మడి పరీక్ష రద్దు

image

APలో ఎలిమెంటరీ(1-8వ తరగతి) విద్యార్థులకు ఉమ్మడి పరీక్షల నిర్వహణ విధానాన్ని హైకోర్టు రద్దు చేసింది. ‘సాల్ట్ పేరుతో 2022లో తెచ్చిన ఈ విధానం చట్ట విరుద్ధం. కామన్ పేపర్, రోజులో 2 పరీక్షలు, నిర్దేశిత టైం టేబుల్ 10వ తరగతి బోర్డు పరీక్షల్ని పోలి ఉన్నాయి. ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు ఏ విద్యార్థీ బోర్డు పరీక్షలో పాస్ కావాల్సిన అవసరం లేదు. అలాగే ఇది ప్రైవేట్ స్కూళ్లకు వర్తించదు’ అని కోర్టు పేర్కొంది.

Similar News

News December 17, 2025

సర్పంచ్ ఫలితాలు.. 3 ఓట్ల తేడాతో గెలుపు

image

TG: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కొంత మంది అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో సర్పంచ్ సీట్లు కైవసం చేసుకున్నారు. భద్రాద్రి జిల్లా గాంధీనగర్‌లో కాంగ్రెస్ బలపరిచిన బానోతు మంగీలాల్ 3 ఓట్ల తేడాతో విజయం సాధించారు. NZB జిల్లా బాన్సువాడ మం. నాగారంలో కాంగ్రెస్ మద్దతుదారు దౌల్తాపూర్ గీత 7 ఓట్ల తేడాతో గెలిచారు. కామారెడ్డి (D) జగన్నాథ్‌పల్లిలో కాంగ్రెస్ బలపరిచిన గోడండ్లు వెంకయ్య 8 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

News December 17, 2025

ఢిల్లీ కాలుష్యానికి వాహనాలూ ప్రధాన కారణం: సుప్రీంకోర్టు

image

ఢిల్లీలో గాలి కాలుష్యం సంక్షోభానికి వాహనాలు కూడా ప్రధాన కారణమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సిటీలోకి ఎంటర్ అయ్యే 9 టోల్ ప్లాజాలను మార్చాలని ఆదేశించింది. కాలుష్య నియంత్రణకు దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాల్సిన అవసరముందని పేర్కొంది. కాలుష్య స్థాయులను సమర్థవంతంగా అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారని కామెంట్లు చేసింది. ట్రాఫిక్ జామ్‌లపై NHAIకి నోటీసులు జారీ చేసింది.

News December 17, 2025

వచ్చే సంక్రాంతికి 21 లక్షల పాస్ పుస్తకాలు: మంత్రి

image

AP: రీ సర్వే చేసిన గ్రామాల్లో వచ్చే సంక్రాంతికి 21 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. భూముల రీ క్లాసిఫికేషన్‌పై దాదాపు లక్ష ఫిర్యాదులు వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రైవేట్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం కలెక్టర్లకు ఇస్తామన్నారు.