News March 18, 2024
స్పందన కార్యక్రమం రద్దు: విశాఖ కలెక్టర్

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఆదివారం కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంత కాలం స్పందన కార్యక్రమం జరగదని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని ప్రజలు, ఫిర్యాదుదారులు గమనించాలని అన్నారు.
Similar News
News December 23, 2025
జనవరి నుంచి రేషన్ డిపోలో గోధుమపిండి: విశాఖ జేసీ

విశాఖలో అన్ని రేషన్ డిపోలలో జనవరి నెల నుంచి గోధుమపిండి పంపిణీ చేయనున్నట్లు జేసీ మయూర్ అశోక్ మంగళవారం తెలిపారు. బియ్యం, పంచదార, రాగులతో పాటు గోధుమపిండి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కేజీ గోధుమపిండి రూ.20కి ఇవ్వనున్నట్టు ప్రకటించారు. తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
News December 23, 2025
విశాఖలో రూ.27 కోట్ల జీఎస్టీ మోసం

విశాఖపట్నం డీజీజీఐ డిప్యూటీ డైరెక్టర్ శ్వేతా సురేష్ నేతృత్వంలో జరిగిన దర్యాప్తులో రూ.27.07 కోట్ల భారీ జీఎస్టీ మోసం వెలుగుచూసింది. ఎటువంటి వస్తు సరఫరా లేకుండా నకిలీ ఐటీసీని సృష్టించిన ఈ నెట్వర్క్ సూత్రధారి మల్లికార్జున మనోజ్ కుమార్ను అధికారులు అరెస్టు చేశారు. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యల్లో భాగంగా విశాఖ జోనల్ యూనిట్ ఈ ఏడాది చేసిన నాలుగో అరెస్టు ఇది అని అధికార వర్గాలు తెలిపాయి.
News December 23, 2025
విశాఖ: రెండో మ్యాచ్లోనూ పైచేయి సాధిస్తారా?

విశాఖపట్నం వేదికగా శ్రీలంక మహిళలతో శనివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు ఘనవిజయం సాధించింది. బౌలర్ల అద్భుత ప్రదర్శన, ఆపై బ్యాటర్ల నిలకడైన ఆటతీరుతో భారత్ 8 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. ఈ విజయం ద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇవాళ రెండో మ్యాచ్లో తలపడనుంది. ఈ మేరకు నిన్న నెట్స్లో టీం చెమటోడ్చారు.


