News July 16, 2024

5.30 కోట్ల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు: మంత్రి

image

AP: రాష్ట్రంలో 5.30 కోట్ల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 6-12 ఏళ్లలోపు ఉన్న 68 లక్షల చిన్నారులకు ఆరోగ్యశ్రీ కింద పరీక్షలు చేస్తామని వెల్లడించారు. వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. YCP హయాంలో తెచ్చిన అప్పులు ఎటు మళ్లించారో తేల్చేందుకు విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు.

Similar News

News November 24, 2025

MBNR: 110 పోగొట్టుకున్న ఫోన్లు స్వాధీనం

image

సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ జానకి అన్నారు. ఇటీవల టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొత్తం 110 మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ (Central Equipment Identity Register) సహకారంతో ట్రేస్ చేసి, సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కవాతు మైదానంలో బాధితులకు అందజేశారు. ప్రతి పౌరుడు డిజిటల్ సురక్షపై అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

News November 24, 2025

ధర్మేంద్ర గురించి తెలుసా?

image

ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. పంజాబ్‌ లుధియానాలోని నస్రలీ గ్రామంలో 1935 డిసెంబర్ 8న ఆయన జన్మించారు. 1960లో ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరా’ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చారు. యాక్షన్ కింగ్‌గానూ పేరు గాంచిన ఆయన సినీ రంగానికి చేసిన కృషికి 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. 2005లో BJP తరఫున రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి లోక్‌‌సభకు ఎన్నికయ్యారు. 2012లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు.

News November 24, 2025

ఇంటర్వ్యూతో ESICలో ఉద్యోగాలు

image

<>ESIC <<>>పట్నా 36 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 12న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD, MS, DNB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.500, SC, STలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in