News July 16, 2024
5.30 కోట్ల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు: మంత్రి

AP: రాష్ట్రంలో 5.30 కోట్ల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 6-12 ఏళ్లలోపు ఉన్న 68 లక్షల చిన్నారులకు ఆరోగ్యశ్రీ కింద పరీక్షలు చేస్తామని వెల్లడించారు. వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. YCP హయాంలో తెచ్చిన అప్పులు ఎటు మళ్లించారో తేల్చేందుకు విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు.
Similar News
News November 29, 2025
ఈ ఫైనాన్స్ జాబ్స్తో నెలకు రూ.లక్షపైనే జీతం

భారతదేశ ఫైనాన్స్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ నుంచి ఫిన్టెక్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో ఎంట్రీలెవల్లోనే నెలకు రూ.లక్షపైనే జీతం ఆఫర్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో అత్యధికంగా M&A అనలిస్ట్కు ఏడాదికి రూ.30 లక్షల వరకు, ఫిన్టెక్ ఫైనాన్షియల్ అనలిస్టుకు ఏడాదికి రూ.20 లక్షల వరకు, రిస్క్ మేనేజ్మెంట్లో క్వాంట్ రిస్క్ అనలిస్టుకు ఏడాదికి రూ.25 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నారు.
News November 28, 2025
ఆధార్ యాప్.. మొబైల్ నంబర్ ఇలా అప్డేట్ చేసుకోండి!

మొబైల్ యాప్ ద్వారా ఆధార్ కార్డుకు లింకైన <<18410970>>మొబైల్ నంబర్ను<<>> అప్డేట్ చేసుకునే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ప్లే స్టోర్లో ‘Aadhaar’ యాప్ డౌన్లోడ్ చేసుకుని లాగిన్ కావాలి. My Aadhar Updatesపై క్లిక్ చేస్తే మొబైల్ నంబర్, అడ్రస్, పేరు, ఈమెయిల్ ఐడీ అప్డేట్స్ అని కనిపిస్తాయి. ప్రస్తుతానికి మొబైల్ నంబర్ అప్డేట్ మాత్రమే పని చేస్తోంది. రూ.75 చెల్లిస్తే 5 నిమిషాల్లో రిక్వెస్ట్ వెళ్తుంది.
News November 28, 2025
గంభీర్ తీరుపై బీసీసీఐ అసంతృప్తి.. ఇదే ఫైనల్ ఛాన్స్?

IND హెడ్ కోచ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇచ్చిన <<18393677>>స్టేట్మెంట్లపై<<>> BCCI అసంతృప్తితో ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ప్రస్తుతం అతనికి బోర్డు సపోర్ట్ ఉన్నప్పటికీ, స్వదేశంలో జరిగే T20 WC రిజల్ట్స్ను బట్టి అది మారొచ్చని తెలిపింది. 2026 AUG వరకు స్వదేశంలో టెస్టులు లేకపోవడంతో టెస్ట్ కోచ్ బాధ్యతల నుంచి ఇప్పట్లో తొలగించకపోవచ్చని అంచనా వేసింది. SAతో టెస్ట్ సిరీస్ ఓడిన అనంతరం గంభీర్పై విమర్శలొచ్చాయి.


