News April 10, 2024

అభ్యర్థి మృతి.. ఎన్నిక వాయిదా

image

మధ్యప్రదేశ్‌లోని బేతుల్ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన BSP అభ్యర్థి అశోక్ మృతి చెందడంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. ఈ నెల 26న ఎన్నిక జరగాల్సి ఉండగా మే 7వ తేదీకి EC వాయిదా వేసింది. 1951 ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 52 ప్రకారం వాయిదా వేసినట్లు EC తెలిపింది. ఎన్నికలకు ముందు జాతీయ పార్టీ లేదా గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి చనిపోతే, కొత్త వ్యక్తిని ప్రకటించడం కోసం ఎన్నికను వాయిదా వేస్తారు.

Similar News

News September 14, 2025

ఏపీ వైద్యారోగ్యశాఖలో 538 పోస్టులు

image

<>ఏపీ<<>> మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వైద్యారోగ్యశాఖలో 538 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్ 3వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ గల వారికి వయోపరిమితిలో సడలింపు కలదు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, BC, EWS, దివ్యాంగులకు రూ.750.

News September 14, 2025

డయేరియా బాధితుల ఇళ్లకే హైజీన్ కిట్లు

image

AP: విజయవాడ న్యూరాజరాజేశ్వరిపేటలోని డయేరియా బాధితులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. నిన్న బాధితులను మంత్రి నారాయణ పరామర్శించి అధికారులకు <<17697179>>ఆదేశాలు<<>> జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటికి హైజీన్ కిట్లు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ‘డయేరియాపై అవగాహన కల్పిస్తున్నాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స‌హాయం కోసం 91549 70454కు కాల్ చేయండి’ అని సూచించారు.

News September 14, 2025

యానిమల్ లవర్స్‌పై ప్రధాని మోదీ సెటైర్లు

image

ఢిల్లీలో ఇటీవల వీధి కుక్కల తరలింపును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యానిమల్ లవర్స్ ఉద్యమించిన విషయం తెలిసిందే. వారి డబుల్ స్టాండర్డ్స్‌పై ప్రధాని మోదీ రీసెంట్‌గా ఓ ఈవెంట్లో సెటైర్లు వేశారు. ‘నేను ఇటీవల కొంతమంది యానిమల్ లవర్స్‌ను కలిశాను. మన దేశంలో అలాంటి వారు చాలామంది ఉన్నారు. కానీ వారిలో ఎక్కువ మంది ఆవులను యానిమల్‌గా పరిగణించరు’ అని వ్యాఖ్యానించారు.