News April 10, 2024
అభ్యర్థి మృతి.. ఎన్నిక వాయిదా

మధ్యప్రదేశ్లోని బేతుల్ లోక్సభ నియోజకవర్గానికి చెందిన BSP అభ్యర్థి అశోక్ మృతి చెందడంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. ఈ నెల 26న ఎన్నిక జరగాల్సి ఉండగా మే 7వ తేదీకి EC వాయిదా వేసింది. 1951 ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 52 ప్రకారం వాయిదా వేసినట్లు EC తెలిపింది. ఎన్నికలకు ముందు జాతీయ పార్టీ లేదా గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి చనిపోతే, కొత్త వ్యక్తిని ప్రకటించడం కోసం ఎన్నికను వాయిదా వేస్తారు.
Similar News
News November 6, 2025
రాష్ట్రపతిని కలిసిన ఇండియన్ టీమ్

WWC గెలిచిన భారత్ జట్టు ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్మును కలిసింది. ఈ సందర్భంగా WC విశేషాలను ప్లేయర్లు పంచుకున్నారు. టీమ్కు శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్రపతి.. భవిష్యత్తు తరాలకు రోల్ మోడల్గా నిలిచారని కొనియాడారు. విభిన్న ప్రాంతాలు, సామాజిక నేపథ్యాలు, ప్రత్యేక పరిస్థితుల నుంచి వచ్చిన ప్లేయర్లంతా ఇండియాను ప్రతిబింబించారని ముర్ము ప్రశంసించారు. కాగా భారత జట్టు నిన్న PM మోదీని కలిసిన విషయం తెలిసిందే.
News November 6, 2025
నకిలీ మద్యం కేసు.. విచారణలు 11కు వాయిదా

* AP నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్, రాము బెయిల్ పిటిషన్లపై విచారణ ఈ నెల 11కు వాయిదా వేసిన విజయవాడ కోర్టు. వారిని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలన్న ఎక్సైజ్ అధికారుల పిటిషన్లపై విచారణా అదే రోజుకు వాయిదా
* ఇదే కేసులో జనార్దన్ రావు, జగన్మోహన్ రావును 5 రోజుల కస్టడీకి కోరిన అధికారులు.. విచారణ 11వ తేదీకి వాయిదా
* ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో IPS సంజయ్ బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా
News November 6, 2025
వరల్డ్ కప్ విజేతలకు కార్లు గిఫ్ట్ ఇవ్వనున్న TATA

మహిళల ప్రపంచకప్ గెలిచిన భారత క్రికెట్ జట్టుకు టాటా మోటార్స్ శుభవార్త చెప్పింది. త్వరలో విడుదల కానున్న Tata Sierra SUV మొదటి బ్యాచ్లోని టాప్ఎండ్ మోడల్ను జట్టులోని ప్రతి సభ్యురాలికి బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. WC విజేతలు & రీఎంట్రీ ఇస్తున్న లెజెండరీ సియెర్రా రెండూ పట్టుదల, ధైర్యం, స్ఫూర్తికి ప్రతీకలని టాటా మోటార్స్ కొనియాడింది. కాగా ఈ కారు నవంబర్ 25న లాంచ్ కానుంది.


