News February 10, 2025
స్కిల్ వర్సిటీకి నిధులివ్వలేం: కేంద్రం

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్కిల్ యూనివర్సిటీకి కేంద్రం షాక్ ఇచ్చింది. దానికి నిధులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా INC MP చామల కిరణ్ అడిగిన ప్రశ్నకు కేంద్రం పైవిధంగా సమాధానం ఇచ్చింది. రాష్ట్రాలు తమ చట్టాల ప్రకారం స్కిల్ వర్సిటీలను ఏర్పాటు చేస్తున్నాయని, వీటికి నిధులిచ్చే పథకమేమీ కేంద్రం వద్ద లేదని మంత్రి జయంత్ చౌదరి తేల్చి చెప్పారు.
Similar News
News December 12, 2025
2027 జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు

AP: గోదావరి నదీ పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. 12 రోజుల పాటు ఇవి కొనసాగుతాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. TTD ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయం మేరకు ఎండోమెంటు కమిషనర్ పుష్కర పుణ్య దినాలపై నివేదిక అందించారు. ఈమేరకు ప్రభుత్వం అధికారికంగా గోదావరి పుష్కర తేదీలను ప్రకటించింది. 2027 జులై 7వ తేదీవరకు ఇవి కొనసాగుతాయని పేర్కొంది.
News December 12, 2025
వారికి ఇంటర్ ఎగ్జంప్షన్ పేపర్కు మార్కులు

AP: ఇంటర్ EXAMSలో దివ్యాంగులు ఎగ్జంప్షన్ పొందిన పేపర్కు ఇకపై సగటు MARKS ఇస్తారు. ఈమేరకు GO విడుదలైంది. వీరు 2 లాంగ్వేజ్ పేపర్లలో 1 రాస్తే చాలన్న రూలుంది. 5 పేపర్లలో 4కి MARKS వేసి మినహాయింపు పేపర్కు ‘E’ అని సర్టిఫికెట్లో పొందుపరుస్తున్నారు. అయితే ఈ సర్టిఫికెట్లపై IIT, NITలు అడ్మిషన్లు నిరాకరిస్తుండడంతో దివ్యాంగులు ఇబ్బంది పడగా గతేడాది లోకేశ్ జోక్యంతో సీట్లు దక్కాయి. ఇపుడన్నిటికీ MARKS ఇస్తారు.
News December 12, 2025
నటికి క్యాన్సర్.. పాపం ఎలా అయ్యారో చూడండి

టాలీవుడ్ సహాయ నటి వాహిని రొమ్ము క్యాన్సర్తో పోరాడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను HYDలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ట్రీట్మెంట్కి సుమారు ₹35లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. విషయం తెలిసిన నటి కరాటే కళ్యాణి SMలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆమె చికిత్స కోసం ఆర్థిక సాయం చేయాలని కోరారు. అటు వాహిని త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు.


