News November 24, 2024
నా వ్యక్తిత్వాన్ని మార్చుకోలేను: అభిషేక్ బచ్చన్

ఐశ్వర్యరాయ్తో విడాకులు వంటి నెగెటివ్ ప్రచారాన్ని హ్యాండిల్ చేయడంపై అభిషేక్ బచ్చన్ స్పందించారు. ‘వ్యక్తిగా మనం ఏంటన్నది స్థిరంగా ఉండాలి. పరిస్థితులకు తగ్గట్టుగా ముందుకెళ్లాలి. లేకపోతే వెనుకబడిపోతాం. కానీ మన మౌలిక విలువలు మారకూడదు. చెడు దాని స్వభావాన్ని మార్చుకోనప్పుడు, మంచి మాత్రం ఎందుకు మార్చుకోవాలి? నేను నా వ్యక్తిత్వాన్ని మార్చుకోలేను’ అని పేర్కొన్నారు.
Similar News
News October 29, 2025
CM చంద్రబాబు ఏరియల్ సర్వే

AP: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. అమరావతి నుంచి ఆయన హెలికాప్టర్లో బయల్దేరారు. వాతావరణం అనుకూలిస్తే అమలాపురంలో దిగి అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారని తెలుస్తోంది. వేల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్లు ఇప్పటికే ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీనిపై ఉదయం ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో సమీక్ష కూడా నిర్వహించారు.
News October 29, 2025
మొంథా తుఫాను – మొక్కజొన్నలో జాగ్రత్తలు

పొలంలో నిల్వ ఉన్న నీటిని 24-48 గంటలలోపు తొలగించాలి. పొలాలు ఎండిన తర్వాత లీటరు నీటికి 10గ్రా. యూరియా+5గ్రా. జింక్ సల్ఫేట్ కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. కోతకు దగ్గరలో ఉన్న మొక్కజొన్న పొత్తులను వెంటనే కోసి వాటిని 12-13% తేమ స్థాయికి ఆరబెడితే మొలకెత్తదు, నాణ్యత తగ్గదు. కండె కుళ్ళు, ఆకుమచ్చ ఇతర శిలీంద్ర తెగుళ్ల నివారణకు లీటరు నీటికి ప్రాపికొనజోల్ 1ml లేదా మాంకోజెబ్ 2.5గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News October 29, 2025
తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన ‘మొంథా’

AP: మొంథా తుఫాను శాంతించింది. తీవ్ర వాయుగుండంగా బలహీనపడి AP, TG, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఐదు రోజుల్లోగా పంటనష్టం అంచనా వేయాలని ఆదేశించామన్నారు.


