News June 8, 2024
రామోజీరావు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా: CBN

యుగపురుషుడు రామోజీరావు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చంద్రబాబు అన్నారు. సాధారణ కుటుంబంలో పుట్టి ఓ వ్యవస్థగా మరారని, ఈనాడుతో ప్రజలను చైతన్యవంతులను చేశారని చెప్పారు. ’40 ఏళ్లుగా నాకు ఆయన పరిచయం. మీరు ఏం చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పని చేస్తానని చెప్పేవారు. ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతం. నాకు క్లిష్టమైన సమస్య వస్తే రామోజీ ధైర్యం చెప్పేవారు’ అని గుర్తు చేసుకున్నారు.
Similar News
News September 12, 2025
అభివృద్ధి కోసమే PPP మోడల్స్: CM చంద్రబాబు

AP: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన అవసరముందని CM చంద్రబాబు Way2News Conclaveలో పేర్కొన్నారు. ‘అభివృద్ధి కోసమే PPP మోడల్స్ అనుసరిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇవే అమలవుతున్నాయి. దీంతో సంపద సృష్టి జరుగుతుంది. ప్రభుత్వానికి ఆదాయం పెరిగి పథకాలు అమలు చేసే శక్తి వస్తుంది. అందుకే గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవాళ్లం. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాం’ అని తెలిపారు.
News September 12, 2025
ట్రెండింగ్లో #Way2NewsConclave2025

ఇండియాలో తొలిసారిగా ఓ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ కాన్క్లేవ్ ఏర్పాటు చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. విజయవాడ కాన్క్లేవ్ గురించి చర్చిస్తూ పలువురు Xలో పోస్టులు పెడుతున్నారు. దీంతో Xలో #Way2NewsConclave2025 ట్రెండ్ అవుతోంది. వచ్చే దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనే కార్యాచరణను సీఎం చంద్రబాబు వే2న్యూస్ కాన్క్లేవ్లో వివరిస్తున్నారు.<<17688514>> లైవ్ను<<>> మీరూ వీక్షించండి.
News September 12, 2025
సంకల్పంతో ఏదైనా సాధించొచ్చు: చంద్రబాబు

AP: పెద్ద కలలు, బలమైన సంకల్పంతో రాష్ట్రం రూ.57 లక్షల కోట్ల GSDP సాధించగలదని చంద్రబాబు అన్నారు. తాను తొలిసారి ఉమ్మడి APకి CM అయినప్పుడు జీతాలు చెల్లించే పరిస్థితి ఉండేది కాదని Way2News కాన్క్లేవ్లో గుర్తుచేశారు. ‘అప్పుడు సంక్షేమ పథకాలపై కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా. సంస్కరణలు చేపట్టా. ప్రజలూ సహకరించడంతో 20ఏళ్లకు HYD అభివృద్ధి చెందింది. అదే సంకల్పంతో ఇప్పుడు ఏపీ ఎదగడం ఖాయం’ అని చెప్పారు.