News March 17, 2024
వారికి రైతు భరోసా ఇవ్వడం కుదరదు: CM

TG: రైతు భరోసా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ‘5 ఎకరాలలోపు ఉన్న దాదాపు 62 లక్షల మంది రైతులకు రైతుబంధు డబ్బు అందించాం. భవిష్యత్తులో రైతు భరోసా పథకం గుట్టలు, చెట్లు, లేఅవుట్లకు ఇవ్వడం కుదరదు. వ్యవసాయ భూమి ఉన్న వారెవరైనా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు’ అని రేవంత్ స్పష్టం చేశారు.
Similar News
News October 21, 2025
కోళ్లలో తెల్లపారుడు వ్యాధి – నివారణకు సూచనలు

కోడి పిల్లల్లో సాల్మొనెల్లా పుల్లొరం బ్యాక్టీరియా వల్ల తెల్లపారుడు వ్యాధి కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన కోడి పిల్లలు నలతగా ఉండి ముడుచుకుని కూర్చుంటాయి. రెట్ట నీళ్లగా తెలుపు లేదా లేత పసుపు పచ్చ రంగులో ఉంటుంది. ఈకలు రాలిపోయి, రెక్కలు వేలాడేస్తాయి. ఈ వ్యాధి నివారణకు సల్ఫా లేదా టెట్రాసైక్లిన్ ముందును చిటికెడు చొప్పున ఒక టీ గ్లాసు నీళ్లలో కలిపి రోజుకు రెండు సార్లు వెటర్నరీ నిపుణుల సూచన మేరకు ఇవ్వాలి.
News October 21, 2025
నిలవాలంటే గెలవాల్సిందే..

WWCలో భారత్ సెమీస్ ఆశలు సంక్లిష్టమయ్యాయి. తర్వాతి 2 మ్యాచుల్లో(న్యూజిలాండ్, బంగ్లాదేశ్)పై గెలిస్తే నేరుగా సెమీస్ వెళ్తుంది. అలా కాకుండా NZపై ఓడిపోతే BANపై తప్పకుండా గెలవాలి. అదే సమయంలో NZ తన తర్వాతి మ్యాచులో ENG చేతిలో ఓడాలి. అప్పుడే భారత్ SF చేరుతుంది. లేదంటే ఇంటిదారి పడుతుంది. ప్రస్తుతం IND, NZ చెరో 4 పాయింట్లతో సెమీస్ చివరి బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. AUS, SA, ENG ఇప్పటికే సెమీస్ చేరాయి.
News October 21, 2025
NCLTలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే ఆఖరు తేదీ

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT)లో లా రీసెర్చ్ అసోసియేట్, డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి LLB/LLM, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.60వేలు (ఢిల్లీలో రూ.80వేలు). వెబ్సైట్: https://nclt.gov.in/