News October 28, 2024

మహారాష్ట్రలో ఒంటరిగా గెలవలేం.. కానీ: ఫడ్నవీస్

image

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో BJP ఒంటరిగా గెలవలేదని ఆ పార్టీ నేత, Dy.cm దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. అయితే అధిక సంఖ్యలో సీట్లు, ఓట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందన్నారు. మిత్రపక్షాలైన షిండే శివసేన, అజిత్ పవార్ NCPలతో కలిసి పోరాడి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ సీట్లు ఆశించిన కొందరికి అవకాశం దక్కకపోవడం బాధాకరంగా ఉందని పేర్కొన్నారు.

Similar News

News January 19, 2026

వందే భారత్ స్లీపర్ టికెట్లకు కొత్త నిబంధనలు

image

వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కిన వేళ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ట్రైన్‌లో టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్‌ను మరింత కఠినతరం చేసింది. 72 గంటలకు ముందు టికెట్ రద్దు చేస్తే 25%, 72 నుంచి 8 గంటల మధ్య క్యాన్సిల్ చేస్తే 50% ఛార్జ్ కట్ అవుతుంది. 8 గంటలలోపు రద్దు చేస్తే ఒక్క రూపాయి కూడా రిఫండ్ ఉండదు. వందేభారత్ స్లీపర్‌లో RAC, వెయిటింగ్ లిస్ట్ ఉండవని ఇప్పటికే రైల్వే శాఖ స్పష్టం చేసింది.

News January 19, 2026

WPL: RCBతో మ్యాచ్.. టాస్ గెలిచిన గుజరాత్

image

ఉమెన్స్ ప్రీమియర్స్ లీగ్‌లో ఇవాళ గుజరాత్, బెంగళూరు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఓటమే(4 మ్యాచులు) ఎరుగని RCB ఈ మ్యాచులోనూ గెలిచి విజయపరంపర కొనసాగించాలని చూస్తోంది. అటు తొలి రెండింట్లో ఓడి తర్వాతి 2 మ్యాచుల్లో నెగ్గిన గుజరాత్ RCBకి తొలి ఓటమి రుచి చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. మరి ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

News January 19, 2026

పెట్టుబడుల వేటలో సీఎంలు!

image

దావోస్ వేదికగా తెలుగు రాష్ట్రాల మధ్య పెట్టుబడుల టార్గెట్ మొదలైంది. రెండు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్, మంత్రులు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు వెళ్లారు. CBN ఒకరోజు ముందే వెళ్లి పలువురు వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఇవాళ రేవంత్ కూడా తన బృందంతో వెళ్లారు. గతంలో కూడా ఇద్దరూ దావోస్ వెళ్లి పెట్టుబడుల కోసం ప్రయత్నించారు. లేటెస్ట్ పర్యటనలతో ఏ రాష్ట్రానికి ఎక్కువ పెట్టుబడులు వస్తాయనే చర్చ మొదలైంది.