News September 10, 2025

కేంద్ర సహకారంతో త్వరలో రాజధాని పూర్తవుతుంది: మాధవ్

image

AP: ఏడాదిలో రూ.9 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని బీజేపీ స్టేట్ చీఫ్ మాధవ్ తెలిపారు. ‘సూపర్ సిక్స్ పథకాలను ఇతర రాష్ట్రాలూ ప్రశంసిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఆర్థిక సాయం అందజేస్తోంది. అమరావతికి ప్రత్యేకంగా రూ.15వేల కోట్ల గ్రాంట్ ఇస్తున్నాం. కేంద్ర సహకారంతో త్వరలో ప్రజా రాజధాని పూర్తవుతుంది. త్వరలో ఏపీ సెమీ కండక్టర్ హబ్‌గా మారబోతోంది’ అని అనంతపురం సభలో పేర్కొన్నారు.

Similar News

News September 10, 2025

AEE ఫలితాలు విడుదల

image

AP పొల్యూషన్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితాను APPSC విడుదల చేసింది. అభ్యర్థులు https://psc.ap.gov.inలో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చని తెలిపింది. 2023లో 21 AEE పోస్టుల భర్తీకి బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన వారికి నెలకు రూ.57,100-రూ.1,47,760 వరకు జీతం రానుంది.

News September 10, 2025

కరిష్మా పిల్లలకు రూ.1,900 కోట్లు అందాయి: సంజయ్ భార్య

image

వ్యాపారవేత్త సంజయ్ కపూర్ ఆస్తిలో రెండో భార్య కరిష్మా కపూర్ పిల్లలు <<17658065>>వాటా<<>> కోరడంపై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఫ్యామిలీ ట్రస్ట్ ద్వారా ఆ పిల్లలకు రూ.1,900 కోట్లు అందాయని మూడో భార్య ప్రియా సచ్‌దేవ్ కోర్టుకు తెలిపారు. సంజయ్ వీలునామా చెల్లుబాటును కోర్టు ప్రశ్నించింది. సంజయ్ ఆస్తుల వివరాలను సమర్పించాలని ప్రియా సచ్‌దేవ్‌ను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది.

News September 10, 2025

అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా SIR!

image

ఓటర్ జాబితా రీవెరిఫికేషన్‌కు సంబంధించి బిహార్‌లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(<<17634931>>SIR<<>>) త్వరలో దేశవ్యాప్తంగా జరగనున్నట్లు సమాచారం. OCT నుంచి ఈ ప్రక్రియ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇవాళ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్‌తో జరిగిన మీటింగ్‌లో ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నెలలోనే గ్రౌండ్ వర్క్ పూర్తిచేస్తామని అధికారులు చెప్పినట్లు సమాచారం.