News September 10, 2025

కేంద్ర సహకారంతో త్వరలో రాజధాని పూర్తవుతుంది: మాధవ్

image

AP: ఏడాదిలో రూ.9 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని బీజేపీ స్టేట్ చీఫ్ మాధవ్ తెలిపారు. ‘సూపర్ సిక్స్ పథకాలను ఇతర రాష్ట్రాలూ ప్రశంసిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఆర్థిక సాయం అందజేస్తోంది. అమరావతికి ప్రత్యేకంగా రూ.15వేల కోట్ల గ్రాంట్ ఇస్తున్నాం. కేంద్ర సహకారంతో త్వరలో ప్రజా రాజధాని పూర్తవుతుంది. త్వరలో ఏపీ సెమీ కండక్టర్ హబ్‌గా మారబోతోంది’ అని అనంతపురం సభలో పేర్కొన్నారు.

Similar News

News March 19, 2026

IPL-2026: స్టార్ బౌలర్లు దూరం!

image

IPL-2026కు మరో ఇద్దరు విదేశీ బౌలర్లు దూరం కానున్నారు. రాజస్థాన్ తరఫున ఆడనున్న సామ్ కరన్ (ఇంగ్లండ్) గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం అయ్యారని క్రీడావర్గాలు వెల్లడించాయి. అటు పంజాబ్ కింగ్స్ బౌలర్ ఫెర్గూసన్ (న్యూజిలాండ్) ఇటీవల తండ్రి అయ్యారు. బిడ్డతో గడిపేందుకు స్వదేశానికి వెళ్లనుండటంతో ఆరంభంలోని కొన్ని మ్యాచులకు దూరం కానున్నారు. ఇప్పటికే కమిన్స్, హేజిల్‌వుడ్ కొన్ని మ్యాచులు ఆడట్లేదు.

News March 19, 2026

ఇరాన్ అటాక్‌తో ఖతర్‌కు ₹9.3లక్షల కోట్ల నష్టం!

image

ఇరాన్ చేసిన దాడులతో ఖతర్‌ ఏటా $20 బిలియన్ల (₹1.86లక్షల కోట్లు) వార్షిక ఆదాయం కోల్పోయిందని ఖతర్ ఎనర్జీ సీఈవో వెల్లడించారు. దీని ప్రభావం ఐదేళ్ల పాటు ఉండి.. మొత్తం ₹9.3లక్షల కోట్ల ఆదాయం కోల్పోయామన్నారు. ఈ దాడులతో ఖతార్ LNG ఎగుమతి సామర్థ్యం 17% తగ్గిందని.. ఏటా 12.8 మిలియన్ టన్నుల ఉత్పత్తి తగ్గనుందని తెలిపారు. దీంతో లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్న దేశాలకు LNG సరఫరా సవాల్‌గా మారిందన్నారు.

News March 19, 2026

అదృష్టం తెచ్చిన కూతురు..

image

‘ధురంధర్’తో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ స్టార్‌డమ్ అమాంతం పెరిగింది. కొవిడ్ తర్వాత ఆయన తీసిన చిత్రాలు ఏవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయాయి. 2022లో జయేశ్‌భాయ్ జోర్దార్, సర్కస్, 2023లో రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. 2024లో రణ్‌వీర్, దీపికా పదుకొణె దంపతులకు పాప జన్మించింది. 2025లో డైరెక్టర్ ఆదిత్య ధర్ ‘ధురంధర్’ ప్రాజెక్టు రావడంతో రణ్‌వీర్ బ్లాక్‌బస్టర్ కొట్టారు.