News March 20, 2024
కారు.. లేదు ఆ జోరు, మార్చాలి గేరు..?

TG: ఓవైపు లోక్సభ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ రెండూ రంగంలోకి దిగాయి. కానీ మళ్లీ చక్రం తిప్పుతామన్న ధీమాతో ఉన్న బీఆర్ఎస్ మాత్రం పత్తా లేదు. ఇప్పటికి 11మంది ఎంపీ అభ్యర్థుల్ని మాత్రమే గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. పలువురు అగ్రనేతలు పార్టీ వీడటం, ఇటు కవితను ఈడీ అరెస్టు చేయడం కారణాల వల్లో ఏమో కానీ.. కేసీఆర్ నుంచి క్షేత్రస్థాయి వరకు పార్టీలో జోరు కనిపించడం లేదు.
Similar News
News November 27, 2025
సినిమా అప్డేట్స్

* మహేశ్ బాబు అన్న కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా తెరకెక్కే తొలి చిత్రానికి ‘శ్రీనివాస మంగాపురం’ టైటిల్ ఖరారు చేస్తూ పోస్టర్ రిలీజ్. దీనికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు.
* రజినీకాంత్ జైలర్-2 సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
* రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తోన్న ‘ధురంధర్’ మూవీ రన్టైమ్ 3.32 గంటలని తెలుస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది.
News November 27, 2025
BREAKING: హైకోర్టు కీలక ఉత్తర్వులు

TG: 2015 గ్రూప్-2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట లభించింది. వారి నియామకాలు రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. 1032 పోస్టులకు 2015లో నోటిఫికేషన్ వచ్చింది. అనేక న్యాయ వివాదాల అనంతరం 2019లో ఎంపిక జాబితాను TGPSC విడుదల చేసింది. అయితే మూల్యాంకనంలో పొరపాట్లు జరిగాయంటూ ఆ నియామకాలను సింగిల్ బెంచ్ రద్దు చేసింది.
News November 27, 2025
వారి కూతుళ్లపై కామెంట్స్.. IASకు నోటీసులు

బ్రాహ్మణుల కూతుళ్లపై <<18384712>>వివాదాస్పద<<>> కామెంట్లు చేసిన ఐఏఎస్ సంతోశ్ వర్మకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం షోకాజ్ నోటీసులిచ్చింది. IAS అధికారుల గౌరవం, ప్రవర్తనకు విరుద్ధంగా ఆయన కామెంట్లు ఉన్నాయని పేర్కొంది. ‘సంతోశ్ చర్యలు ఏకపక్షం, తీవ్రమైన దుష్ప్రవర్తన కిందికి వస్తాయి. ఆయన IAS రూల్స్(కండక్ట్)-1967ను ఉల్లంఘించారు. సంతోశ్ సమాధానం సంతృప్తికరంగా లేకపోతే క్రమశిక్షణాచర్యలను ఎదుర్కోవాల్సిందే’ అని స్పష్టం చేసింది.


