News March 20, 2025

బండి సంజయ్‌పై కేసు కొట్టివేత

image

TG: కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై 2020లో GHMC ఎన్నికల ప్రచారం వేళ నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. అప్పుడు కార్యకర్తల భేటీలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆయనపై సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇవాళ ఆ కేసుపై విచారణ జరగ్గా ఆధారాలు లేవని బండి సంజయ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కేసు కొట్టేస్తూ తీర్పునిచ్చింది.

Similar News

News October 23, 2025

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ గైడ్‌లైన్స్ విడుదల

image

AP: NCTE నిబంధనల ప్రకారం TET నిర్వహించేలా GOVT గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో టీచర్లందరికీ టెట్ తప్పనిసరి చేసింది. టెట్‌ 2A, 2B (B.Ed) పేపర్లలో SC, ST, BC, PHCలకు అర్హత మార్కుల్లో మినహాయింపు ఈసారి లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్‌ పాసవ్వాలి. అయితే వారికి నిర్దేశిత అర్హతల నుంచి మినహాయింపు ఇచ్చారు. డిటైల్డ్ గైడ్ లైన్స్ కోసం <>క్లిక్<<>> చేయండి.

News October 23, 2025

‘మీ తాత కూడా ఇండియా నుంచే వచ్చాడు..!’

image

సామూహిక వలసలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ US రిపబ్లికన్ నేత నిక్కీ హెలీ కొడుకు నలిన్ హేలీ చేసిన ట్వీట్ చర్చకు దారితీసింది. వలసలతో US పౌరులకు ఉద్యోగాలు లభించడంలేదన్నారు. దీంతో అతడికి బ్రిటీష్-అమెరికన్ జర్నలిస్ట్ మెహదీ హసన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘మీ తాత కూడా ఇండియా నుంచే వచ్చారు’ అని నలిన్‌కు గుర్తుచేశారు. నిక్కీ హెలీ తండ్రి అజిత్ సింగ్ రంధవా 1969లో అమెరికాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.

News October 23, 2025

ఇండియా టెక్ డెస్టినేషన్‌గా ఏపీ: CM CBN

image

డేటా సెంటర్లు, AI మెషీన్ లెర్నింగ్, ఫిన్‌టెక్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ గవర్నెన్సు వంటి రంగాల్లో పెట్టుబడులకు AP ఎంతో అనుకూలమని CM CBN తెలిపారు. ఇండియా టెక్ డెస్టినేషన్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు. UAE టెక్ కంపెనీలతో కలిసి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. అబుదబీలో నెట్వర్క్ లంచ్‌లో పాల్గొన్న ఆయన ఆ దేశ ఛాంబర్ ఛైర్మన్, ADNOC గ్లోబల్ ట్రేడింగ్ ప్రతినిధులతో భేటీ అయ్యారు.