News December 11, 2024

పేర్ని నాని భార్య జయసుధపై కేసు

image

AP: రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై కేసు నమోదైంది. సివిల్ సప్లైస్ అధికారి కోటి రెడ్డి ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ హయాంలో జయసుధ పేరిట నాని ఓ గిడ్డంగి నిర్మించారు. దీనిని పౌరసరఫరాలశాఖకు అద్దెకు ఇచ్చారు. ఇటీవల ఈ గోడౌన్‌ను పోలీసులు తనిఖీలు చేయగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు.

Similar News

News September 21, 2025

వరిలో ఎలుకల నివారణకు ఇలా చేయండి

image

* బ్రోమోడయోలిన్ మందు 10-15 గ్రా.(పిడికెడు నూకలు, కాస్త నూనెతో కలుపుకుని) పొట్లాలుగా కట్టి కన్నానికి ఒకటి చొప్పున పెట్టాలి.
* ఈ మందును 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పెట్టుకోవాలి.
* కన్నాల దగ్గర పొగబారించుకోవడం ద్వారా ఎలుకలను తరిమివేయవచ్చు.
* ఎకరానికి 20 చొప్పున ఎలుక బుట్టలు పెట్టుకోవాలి.
* ఎలుకలను నిర్మూలించడానికి రైతులు సామూహికంగా చర్యలు చేపడితే ప్రయోజనకరంగా ఉంటుంది.
<<-se>>#PADDY<<>>

News September 21, 2025

13,217పోస్టులు.. అప్లైకి ఇవాళే ఆఖరు

image

<>IBPS <<>>గ్రామీణ బ్యాంకుల్లో 13,217 పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇవాళే ఆఖరు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ద్వారా ఈ నియామకం జరుగుతుంది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు: SC/ST/ PwBD ₹175,ఇతరులు : ₹850. వెబ్‌సైట్: www.ibps.in

News September 21, 2025

ఏసీల ధరలు రూ.4,500 వరకు తగ్గింపు

image

GST శ్లాబుల మార్పుతో ఏసీలు, డిష్ వాషర్ల ధరలను తగ్గిస్తున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. ఏసీలపై సగటున రూ.4,500, డిష్ వాషర్లపై రూ.8వేల వరకు రేట్లు తగ్గిస్తున్నట్లు వోల్టాస్, డైకిన్, గోద్రేజ్, పానాసోనిక్, Haier తదితర కంపెనీలు ప్రకటించాయి. LG 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC ధర రూ.3,600 తగ్గింది. డైకిన్ 1 టన్ 3 స్టార్ ఏసీ ధర రూ.50,700 నుంచి రూ.46,730కి తగ్గింది. రేపటి నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.