News July 11, 2024

TDP ఆఫీసుపై దాడి కేసు.. సజ్జల ముందస్తు బెయిల్‌పై నేడు విచారణ

image

AP: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021లో జరిగిన దాడి కేసులో వైసీపీ సీనియర్ నేతలు సజ్జల, ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు హైకోర్టు విచారణ జరపనుంది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాశ్ బెయిల్ పిటిషన్లు వేశారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 11 మందిని అరెస్టు చేశారు.

Similar News

News October 25, 2025

హెన్నాతో జుట్టుకు ఎన్నో లాభాలు

image

జుట్టు ఆరోగ్యాన్ని పెంచడానికి మన పూర్వీకుల నుంచి హెన్నా వాడుతున్నారు. ఇది చుండ్రును తగ్గించడంతో పాటు, జుట్టుకు సహజసిద్ధమైన రంగును అందించి కండిషనింగ్ చేస్తుంది. దీంట్లోని యాంటీఫంగల్, యాంటీమైక్రోబియల్ గుణాలు కుదుళ్లలోని ఇన్ఫెక్షన్లను తొలగించడంతో పాటు జుట్టుకు పోషణను అందించి ఒత్తుగా పెరిగేలా చేస్తాయంటున్నారు నిపుణులు. అంతేకాకుండా పొడిబారిన జుట్టుకు తేమను అందించి, చివర్లు చిట్లే సమస్యనూ తగ్గిస్తుంది.

News October 25, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

* ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ నేతలతో కీలక భేటీ
* మద్యం దుకాణాల టెండర్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్
* త్వరలోనే 14,000 అంగన్‌వాడీ హెల్పర్ల నియామకం
* కర్నూల్ బస్సు ప్రమాదం నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రైవేటు బస్సుల్లో ముమ్మర తనిఖీలు
* హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో కొనసాగుతున్న వర్షాలు

News October 25, 2025

మర్రి చెట్టును ఎందుకు పూజించాలి?

image

మర్రిచెట్టు జ్ఞానం, పవిత్రత, సౌభాగ్యానికి నిదర్శనం. దీన్నే వట వృక్షం అని అంటారు. మహా ప్రళయం తర్వాత విష్ణుమూర్తి శిశువుగా ఈ చెట్టు ఆకుపై శయనించడం వల్లే ఆయనకు ‘వటపత్రశాయి’ అనే నామం వచ్చింది. కైలాసంలో శివుడు ఈ వృక్షం నీడనే నివసిస్తాడని చెబుతారు. స్త్రీలు తమ వైవాహిక సౌభాగ్యం కోసం ఈ చెట్టును పూజించి, జ్యేష్ఠ పౌర్ణమిన ‘వటసావిత్రీ వ్రతం’ ఆచరిస్తారు. దీని కింద రుషులు ధ్యానం చేసి, విశ్రాంతి తీసుకుంటారు.